ఈ రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కొన్ని క్రేజీ మూవీ ల షూటింగ్ లు జరుగుతున్నాయి. అవి ఏ ప్రాంతంలో జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆ చిత్ర బృందాలు ఏ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాయో తెలుసుకుందాం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ హీరోలుగా "బ్రో" అనే సినిమా రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి సముద్ర ఖని దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ మూవీ బృందం ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.

సిద్దు జొన్నలగడ్డ హీరో గా ప్రస్తుతం టిల్లు స్క్వేర్ అనే మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో సిద్దు సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ మూవీ బృందం ప్రస్తుతం సిద్దు , అనుపమ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.

నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్ లో 108 వ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. దానితో ఈ మూవీ షూటింగ్ ను "ఎన్ బి కే 108" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ బృందం తెరకెక్కిస్తోంది. ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... శ్రీ లీల ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.

విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా శివ నర్వాన దర్శకత్వంలో ఖుషి అనే మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ బృందం టర్కీలో సాంగ్ షూటింగ్ ను జరుపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: