నవీన్ చంద్ర కలర్స్ స్వాతి జంటగా నటించిన మంత్ ఆఫ్ మధు సినిమా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఆ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమం లో భాగంగా వీరిద్దరూ ప్రస్తుతం వరస ఇంటర్వ్యూలు ఇస్తూ వారికి సంబంధించిన పలు రకాల ఆసక్తి విషయాలను వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా వీరిద్దరు గతంలో కలిసి నటించిన సమయంలో వచ్చిన వార్తలు గురించి ఎక్కువగా మాట్లాడారు. మంత్ ఆఫ్ మధు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నవీన్ మాట్లాడుతూ.. తమ ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అనీ.. ఇద్దరం కలిసి త్రిపుర సినిమా కోసం పని చేసాము అని..

అప్పటినుండే మా ఇద్దరి మధ్య స్నేహం ఉంది అని.. ఈ సందర్భంగా ఆయన వెల్లడించడు. మళ్లీ స్వాతి తో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉంది అని పేర్కొన్నారు. త్రిపుర సినిమాలో నటిస్తున్న సమయంలో వీరిద్దరికీ పెళ్లి అయింది అన్న వార్తలు చాలా వచ్చాయి. అప్పుడు వచ్చిన వార్తల గురించి నవీన్ స్పందిస్తూ షూటింగ్ సమయంలో మెము ఇద్దరం పెళ్లి డ్రెస్సులో ఉన్న ఫోటోలు బయటకి వచ్చాయి అని.. ఆ సమయంలో చాలామంది మేమిద్దరం పెళ్లి చేసుకున్నాము అని అనుకున్నారు అని.. దాని తర్వాత అదే ఫోటోతో సినిమాకి సంబంధించిన ఒక పోస్టర్ రావడంతో అందరికీ అర్థమయింది అని..

అది సినిమా షూటింగ్లో భాగమని తెలిసిన తర్వాత ఆ విషయం గురించి మాట్లాడలేదు అని వెల్లడించారు. దాని తరువాత కూడా కొందరు అప్పట్లో స్వాతిని పెళ్లి చేసుకుంటారా అని అనుమానంతో నన్ను ప్రశ్నించేవారు అని చెప్పారు. మేమిద్దరం కూడా అప్పట్లో వచ్చిన పెళ్లి వార్తలు చాలా లైట్ తీసుకున్నాం.. ఇద్దరం చాలా కూల్ గా ఆ విషయం పై స్పందించాం.. సినీ ఇండస్ట్రీలో ఇలాంటివి చాలా కామన్ అని నవ్వుకున్నాం అంటూ వెల్లడించాడు నవీన్. అనంతరం ఇప్పుడు మళ్లీ ఇన్ని ఏళ్ళ తర్వాత మంత్ ఆఫ్ మధు సినిమాతో మరొకసారి ప్రేక్షకుల ముందుకు అలరించడానికి వస్తున్నాము అంటూ చెప్పుకొచ్చాడు నవీన్ చంద్ర. దీంతో ఆయన చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: