‘యానిమల్’ కథను రాసుకున్నప్పుడే.. ‘యానిమల్ పార్క్’కు సంబంధించిన బేసిక్ కథ పూర్తయినట్టు సమాచారం. కానీ దానిని పూర్తిస్థాయి స్క్రిప్ట్ గా మార్చడానికి మరికాస్త సమయం పడుతుంది. ఇక ‘యానిమల్ పార్క్’ బేసిక్ కథ ప్రకారం.. ఇది రణబీర్ కపూర్ క్యారెక్టర్ అయిన రణవిజయ్ సింగ్ కి , తనలాగే కనిపించే విలన్ కి మధ్య జరిగే వైలెన్స్ పై ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే రణబీర్ కపూర్ తరహాలోనే ఉండే విలన్ ను ‘యానిమల్’ క్లైమాక్స్ లో ప్రేక్షకులకు పరిచయం చేశాడు దర్శకుడు సందీప్. దాంతో పాటు రణవిజయ్ పాత్రకు, తన భార్య గీతాంజలి మరియు వాళ్ల కొడుకుకు మధ్య రిలేషన్షిప్ ని కూడా ‘యానిమల్ పార్క్’లో మరింత స్పష్టంగా చూపించబోతున్నాడట సందీప్ రెడ్డి వంగా. ప్రస్తుతం రణబీర్ కపూర్.. ‘రామాయణ’పై ఫోకస్ చేస్తుండగా.. సందీప్ ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ కానున్నట్లు సమాచారం.‘కల్కి 2898 ఏడీ’ మూవీ షూటింగ్ చివరిదశకు చేరుకోవడంతో ‘రాజా సాబ్’తో పాటు ‘స్పిరిట్’ షూటింగ్ ను కూడా ఒకేసారి చేసేయాలనే ఆలోచనలో ప్రభాస్ ఉన్నట్టు సమాచారం.. ఒకవేళ అదే జరిగితే సందీప్ సోదరుడు ప్రణయ్ వంగా ‘యానిమల్ పార్క్’ స్క్రిప్ట్స్ పై దృష్టిపెట్టనున్నాడు. రైటర్స్ తో కలిసి స్క్రిప్ట్ను పూర్తిచేసే విషయంలో ప్రణయ్ సాయం చేయనున్నాడని తెలుస్తోంది.ప్రస్తుతం వస్తున్న న్యూస్ ను బట్టి ‘యానిమల్ పార్క్’ షూటింగ్ 2025లో ప్రారంభం కానుందని సమాచారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి