ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నిర్మాత గా కెరియర్ ను కొనసాగిస్తున్న వారిలో సూర్య దేవర నాగ వంశీ ఒకరు . ఈయన సీతార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఇప్పటికే ఎన్నో సినిమాలను నిర్మించి ప్రస్తుతం ఎన్నో నిర్మిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీ లో తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్నాడు . ఇక పోతే ఈయన తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా కమర్షియల్ సినిమాలలో స్టార్ హీరోలు నటించినప్పుడు కొన్ని విషయాలను జనాలు పట్టించుకోకూడదు అని చెప్పుకొచ్చాడు.

తాజా ఇంటర్వ్యూ లో భాగంగా నాగ వంశీ మాట్లాడుతూ ... తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ "సలార్" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఆ మూవీ ని చాలా మంది ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూ ఉంటే మరి కొంత మంది మాత్రం కొన్ని సన్నివేశాలలో లాజిక్ లో వెతికారు. ఇకపోతే మేము సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే మూవీ ని రూపొందించాం. ఈ మూవీ ని కూడా చాలా మంది ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. ఇకపోతే ఈ సినిమాలో మహేష్ బాబు గుంటూరు లో ఉంటాడు.

కాకపోతే కొన్ని సమయాల్లో ఆయన హైదరాబాదు కు వెళుతూ ఉంటాడు. ఇలా మహేష్ బాబు గుంటూరు నుండి హైదరాబాద్ ... హైదరాబాద్ నుండి గుంటూరు కు వచ్చే సన్నివేశాల గురించి కూడా కొంత మంది అనేక లాజిక్ లను వెతికారు. స్టార్ హీరోలు కమర్షియల్ సినిమాలలో నటించినప్పుడు అందులో సన్నివేశాలు ఎంటర్టైనర్ గా ఉన్నాయా లేవా అనేదే చూడాలి కానీ అందులో లాజిక్ లు వెతకకూడదు అని నాగ వంశీ తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: