ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన యాత్ర 2 మూవీ ఫిబ్రవరి 8న థియేటర్లలో రిలీజైంది. దాదాపు 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ నిర్మాతలకు భారీగా నష్టాలను మిగిల్చింది.మొత్తం థియేట్రికల్ రన్‌లో యాత్ర 2 మూవీ పది కోట్లలోపే వసూళ్లను రాబట్టినట్లు సమాచారం. ఈ మూవీ పరాజయానికి చాలా కారణాలు వున్నాయి..వైఎస్‌ జగన్ గురించి ప్రచారంలో ఉన్న, అందరికి తెలిసిన కథనే దర్శకుడు ఈ సినిమాలో చూపించడం అలాగే జగన్‌లోని పాజిటివ్ కోణాలను మాత్రమే ఈ సినిమాలో టచ్ చేయడంతో యాత్ర 2 మూవీ పరాజయానికి కారణమని ప్రచారం జరుగుతోంది.2019 లో రిలీజైన యాత్ర మూవీకి సీక్వెల్‌ గా దర్శకుడు మహి .వి రాఘవ్ యాత్ర 2 సినిమాను తెరకెక్కించారు. యాత్ర సినిమా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలోని కీలక అంశాల ఆధారంగా తెరకెక్కింది. 

యాత్ర మూవీ లో మలయాళ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్ర లో నటించారు.అయితే యాత్ర మూవీ కమర్షియల్‌ గా మంచి విజయం సాధించింది. కానీ సీక్వెల్ మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది.ఇదిలా ఉంటే యాత్ర 2 మూవీ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యాత్ర 2 లో జగన్ పాత్ర లో కోలీవుడ్ నటుడు జీవా నటించాడు. అలాగే మలయాళ స్టార్ మమ్ముట్టి గెస్ట్ రోల్ చేశారు.థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత యాత్ర 2 మూవీ ఓటీటీలోకి రాబోతోంది.యాత్ర 2 మూవీ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నది. ఏప్రిల్ 19న ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. తెలుగుతో పాటు తమిళం మరియు మలయాళ భాషల్లో కూడా యాత్ర 2 స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. త్వరలోనే యాత్ర 2 ఓటీటీ రిలీజ్ డేట్‌ పై అమెజాన్ ప్రైమ్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: