అక్కినేని అఖిల్  నటించిన ఏంజెట్ మూవీ థియేటర్లలో విడుదలై దాదాపు ఏడాది పూర్తి కాబోతుంది. కానీ ఇప్పటివరకు ఈ మూవీ ఓటీటీలో మాత్రం స్ట్రీమింగ్ కాలేదు.. ఈ స్పై అండ్ యాక్షన్ మూవీ స్ట్రీమింగ్ హక్కులను సోనీ లివ్ ఓటీటీ కొనుగోలు చేసింది.అయితే సోనీ లివ్ ఏజెంట్‌ మూవీని  ఓటీటీ లో స్ట్రీమింగ్ చేసేందుకు పలుమార్లు ప్రయత్నాలు చేసింది. కానీ నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య ఉన్న కోర్టు గొడవలు మరియు ఇతర సమస్యల వల్ల ఏజెంట్ మూవీ ఓటీటీ రిలీజ్ వాయిదాపడుతూ వచ్చింది. ఈ స్పై అండ్ యాక్షన్ మూవీ ఓటీటీ రిలీజ్‌ గురించి అఖిల్ అభిమానులు ఎప్పుడో ఆశలు వదులుకున్నారు. ఏజెంట్ మూవీని ఓటీటీలో చూడటం కలేనని వారు భావిస్తున్నారు.తాజాగా అఖిల్ ఏజెంట్ ఓటీటీ రిలీజ్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. హీరో అఖిల్ అక్కినేనితో పాటు అనిల్ సుంకరను ట్యాగ్ చేస్తూ ఏజెంట్‌ను ఓటీటీలో రిలీజ్ చేయండి అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఆ నెటిజన్ ట్వీట్‌కు అనిల్ సుంకర రిప్లై ఇచ్చాడు.

ఏజెంట్ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను సోనీ లివ్‌కు అమ్మినట్లు అనిల్ సుంకర తెలిపారు.ఇప్పటికే ఈ విషయాన్ని ఎన్నో సార్లు చెప్పానని ఆయన గుర్తుచేశారు. అతి త్వరలోనే ఏజెంట్ మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని అనిల్ సుంకర ఈ ట్వీట్‌లో పేర్కొన్నాడు.ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది..ఏజెంట్ మూవీకి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించారు. దాదాపు ఎనభైకోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని రూపొందించారు. గత ఏడాది ఏప్రిల్ 28న విడుదల అయిన ఈ మూవీ థియేటర్లలో కేవలం ఎనిమిది కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టి అఖిల్ కెరీర్ లో నే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మిగిలింది. నిర్మాతలకు కోలుకోలేని నష్టాలను మిగిల్చింది. ఈ మూవీని తెలుగుతో పాటు మలయాళంలో విడుదల చేయగా అక్కడ కూడా సేమ్ రెస్పాన్స్ లభించింది..దీనితో ఈ మూవీకి ఊహించని నష్టాలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: