కీర్తిసురేష్ పోలీస్ ఆఫీసర్ గా నటించి  యాక్షన్ థ్రిల్లర్ మూవీ “సైరన్’ ఓటీటీలోకి వచ్చేస్తోంది. తెలుగులో ఈ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది.ఈ మూవీలో జయం రవి హీరోగా నటించారు. అలాగే క్యూట్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్రలో నటించింది. సైరెన్ మూవీ తెలుగు వెర్షన్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో “సైరన్ 108” పేరుతో ఏప్రిల్ 19 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ మరియు మలయాళం హిందీ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. సైరన్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అఫీషియల్‌గా అనౌన్స్‌చేసింది. థియేటర్లలో విడుదలైన రెండు నెలల గ్యాప్ తర్వాత సైరన్ ఓటీటీలో విడుదల కాబోతోంది.రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో జయంరవి ఖైదీగా కనిపించగా, కీర్తిసురేష్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది.మూగచెవిటి అమ్మాయిగా  అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్రలో కనిపించింది.

ఫిబ్రవరి 16న సైరన్ మూవీ థియేటర్లలో రిలీజైంది. తెలుగుతో పాటు తమిళంలో ఏకకాలంలో ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. కానీ కారణాల వల్ల తెలుగు వెర్షన్ రిలీజ్ వాయిదాపడింది. తమిళంలో నెగెటివ్ టాక్ రావడంతో తెలుగు వెర్షన్ రిలీజ్‌ కాలేదు.. దీనితో తెలుగు వెర్షన్ డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ అవుతోంది..రొటీన్ స్టోరీలైన్‌ మరియు ఇన్వేస్టిగేషన్ సీన్స్‌లో ఈ మూవీలో థ్రిల్ మిస్సవ్వడంతో ప్రేక్షకుల్ని అంతగా మెప్పించలేకపోయింది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ఓ హీరోయిన్ అంటూ ప్రచారం చేశారు. కానీ ఆమె కేవలం గెస్ట్ రోల్‌కే పరిమితం చేయడం కూడా ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహానికి గురయ్యారు..అయితే పోలీస్ ఆఫీసర్‌గా కీర్తిసురేష్ యాక్టింగ్‌కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. సైరన్ మూవీకి ఆంటోనీ భాగ్యరాజ్ దర్శకత్వం వహించాడు.థియేటర్స్ లో అంతగా ఆకట్టుకోని ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులనైనా మెప్పిస్తుందో లేదో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: