కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన నటులలో జయం రవి ఒకరు . ఈయన ఇప్పటికే ఎన్నో విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి తమిళ సినీ పరిశ్రమలో నటుడిగా తన కంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక పోతే ఈయన కొంత కాలం క్రితం సైరన్ అనే సినిమాలో హీరో గా నటించాడు . ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణులు అయినటువంటి కీర్తి సురేష్ , అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్రలలో నటించగా ... సముద్ర ఖని ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటించాడు.

ఇకపోతే మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది . దానితో ఈ సినిమా యావరేజ్ మూవీ గా మిగిలిపోయింది . ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను భారీ స్థాయిలో ఆకట్టు కోలేక పోయిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా ఈ మూవీ యొక్క "ఓ టి టి" విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

సినిమా యొక్క "ఓ టి టి" హక్కులను ప్రముఖ డిజిటల్ సంస్థలలో ఒకటి అయినటువంటి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని ఏప్రిల్ 19 వ తేదీ నుండి తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ కే పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషలేదియాలో తెగ వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

jr