టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న నటులలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒకరు. ఈయన అల్లుడు శీను అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా మంచి గుర్తింపు లభించింది. ఇక ఆ తర్వాత ఈయన పలు సినిమాలలో నటించగా రాక్షసుడు సినిమా ఈయనకు మంచి విజయాన్ని సూపర్ క్రేజ్ ను తీసుకువచ్చింది.

ఈ నటుడు కొంతకాలం క్రితం తెలుగులో బ్లాక్ బస్టర్ విజయం సాధించినటువంటి చత్రపతి మూవీ ని చత్రపతి పేరుతోనే హిందీ లో రీమిక్ చేశాడు. పర్వాలేదు అనే స్థాయి అంచనాల నడమ విడుదల అయిన ఈ సినిమా హిందీ ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయింది. దానితో ఈ సినిమా ఈ నటుడు కి బాలీవుడ్ ఇండస్ట్రీ లో చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఇక ప్రస్తుతం మాత్రం ఈయన వరుస తెలుగు సినిమాలను ఓకే చేస్తూ వెళుతున్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం.

ప్రస్తుతం ఈ యువ నటుడు భీమ్లా నాయక్ మూవీ దర్శకుడు అయినటువంటి సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న టైసన్ నాయుడు అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ తో పాటు షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు నిర్మించబోయే మూవీ కి కూడా ఈ నటుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నాడు. అలాగే మూన్ షైన్ పిక్చర్స్ బ్యానర్ వారు నిర్మించబోయే ఓ మూవీ కి కూడా ఈ యువ నటుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక షైన్ స్క్రీన్స్ , మూన్ షైన్ పిక్చర్స్ బ్యానర్ వారు నిర్మించబోయే సినిమాలకు సంబంధించిన అధికారిక అనౌన్స్మెంట్ లు మరికొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

bss