చాలా రోజుల నుండి మెగా అల్లు అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే.అయితే చాలామంది వాళ్ళ ఫ్యామిలీలు ఒక్కటే అని చెప్పినప్పటికీ కూడా వీళ్లు సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తూ ఉంటారు.అంతే కాదు కొంతమంది సెలబ్రిటీలు కూడా అల్లు అర్జున్ ని ఉద్దేశించి ఆయన కించపరిచేలా మాట్లాడడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా ఓ నిర్మాత పెట్టిన పోస్ట్ మెగా ఫ్యాన్స్ కి గట్టి షాక్ తగిలినట్టు అయింది.ఇక నిర్మాత ఎవరయ్యా అంటే.. ఎస్కేఎన్.. బేబీ మూవీ నిర్మాతగా చేసిన ఎస్కేఎన్ ఈ సినిమా హిట్ అవ్వడంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయారు. అంతకుముందు కొన్ని చిన్న సినిమాలకు కో ప్రొడ్యూసర్ గా చేసినప్పటికీ బేబీ సినిమా ఈయనకు మంచి పేరు తెచ్చి పెట్టింది. అయితే అలాంటి నిర్మాత ఎస్కేఎన్ అల్లు మెగా ఫ్యామిలీకి మంచి విధేయుడుగా ఉంటారు.


 ముఖ్యంగా మొదట్లో మెగా ఫ్యామిలీకి వీరాభిమానిగా ఉన్న ఈయన ఆ తర్వాత అల్లు అర్జున్ పి ఆర్ గా పనిచేశారు. ఇక సోషల్ మీడియాలో అల్లు మెగా ఫ్యామిలీ మధ్య గొడవలు ఉన్నాయి అని వార్తలు వచ్చిన ప్రతిసారి ఈయన మీడియా ముందుకు వచ్చి వాళ్ళ మధ్య ఏమి గొడవలు లేవని మధ్యలో వచ్చే వాళ్లే వారికి ఏదో ఉన్నట్టు క్రియేట్ చేస్తారని చాలా సార్లు చెప్పుకొచ్చారు. అంతేకాదు వాళ్ళ ఇంట్లో ఎలాంటి గొడవ లేకుండా కలిసిమెలిసి ఉంటారని చెబుతారు.అయితే తాజాగా ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు.అందులో నితిన్ హీరోగా చేసిన అఆ మూవీలోని రావు రమేష్ అజయ్ ఇద్దరు కలిసి ఇప్పుడేం చేద్దాం నాన్న అని అడిగితే..ఇంకేముంది పిసుక్కోవడమే అంటూ వచ్చే డైలాగ్ కి సంబంధించిన వీడియో షేర్ చేస్తూ "ఇది చెప్పేది నీలాంటి వాళ్లకే..


ఇంకెప్పుడూ అలాంటి చిల్లర డిబేట్లకు వెళ్లి ఫ్యామిలీ హీరోల సినిమాపై నోరు పారేసుకోకు..ఫ్యామిలీ హీరోలు మాత్రమే కాదు ఇతర ఏ హీరోల సినిమాలపై కూడా అలాంటి కామెంట్లు ఎప్పుడు చేయకు.. చాలా రోజుల నుండి సోషల్ మీడియాలో ఏదో కొట్టుకుంటున్నారు.. ఇప్పటితో ఆపేయండి" అంటూ నిర్మాత ఎస్కేఎన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ పోస్ట్ పెట్టారు. అయితే ఈ పోస్టు అల్లు మెగా ఫ్యామిలీ మధ్య గొడవలు ఉన్నాయని క్రియేట్ చేసే వాళ్ళకే అని ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ ఈ మధ్యకాలంలో బన్నీని చాలా ట్రోల్ చేస్తున్నారు.వారిని ఉద్దేశించి పరోక్షంగా ఈ పోస్ట్ పెట్టినట్టు అర్థమవుతుంది. అయితే నిన్న జరిగిన పుష్ప -2 సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ కళ్యాణ్ బాబాయ్ అంటూ స్పెషల్గా విష్ చేసిన సంగతి మనకు తెలిసిందే.దీంతో వీరి మధ్య గొడవలు గొడవలు ఏవి లేవు అని మధ్యలో వచ్చిన వాళ్లే ఏదో ఒకటి క్రియేట్ చేస్తారని అర్థం అయిపోయింది.ఇక నిర్మాత ఎస్కేఎన్ చెప్పింది కూడా ఇదే

మరింత సమాచారం తెలుసుకోండి: