వాస్తవానికి కన్నడ బ్యూటీ అయినప్పటికీ తెలుగు ఆడియోస్ కి కూడా బాగా సుపరిచితమైంది నటి శోభా శెట్టి..తెలుగు బుల్లితెరపై నటి శోభా శెట్టి కార్తీకదీపం సీరియల్ ద్వారా నెగటివ్ పాత్రలో కనిపించి బాగా పేరు సంపాదించింది. అనంతరం బిగ్ బాస్ సీజన్ 7 లో పాల్గొన్న శోభా శెట్టి  ఫైనల్ వరకు వెళ్లలేకపోయినా తన ఆట ,మాట తీరుతో మాత్రం ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించి హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత మరింత క్రేజీ పెంచుకోవడమే కాకుండా.. సీరియల్స్లలో నటిస్తూ మరొకవైపు కన్నడలో కూడ కనిపిస్తూ ఉన్నది.. అయితే అనారోగ్య సమస్యల వల్ల కన్నడ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చేసింది. ఇదంతా ఇలా ఉండగా తాజాగా సోషల్ మీడియాకి కొద్ది రోజులు బ్రేక్ ఇవ్వబోతున్నానంటూ తెలియజేసింది శోభా శెట్టి.


దీంతో ఒక్కసారిగా అభిమానులు ఆశ్చర్యపోతూ శోభాశెట్టికి ఏమైంది? ఎందుకు సోషల్ మీడియాకు గుడ్ బాయ్ చెబుతోంది అంటూ అభిమానులు నెటిజెన్స్ పలు రకాలుగా ఆమె సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు ఫోటోలను షేర్ చేసే శోభాశెట్టి సడన్గా బ్రేక్ తీసుకుంటుంది అంటూ అభిమానులు ఆలోచిస్తూ ఉన్నారు. శోభ శెట్టి నటుడు యశ్వంత్ ని ప్రేమించి వివాహం చేసుకోబోతోంది. ఇటీవలే వీరికి సంబంధించి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారట.



కానీ శోభా శెట్టి వ్యక్తిగత కారణాలవల్ల సోషల్ మీడియాకి దూరంగా ఉండబోతోందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత అవకాశాలు పెద్దగా రాలేదని అయితే వచ్చిన కార్తీకదీపం 2 సీరియల్ అవకాశం కూడా చేజారిపోయిందని తెలుస్తోంది. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చి గార్మెంట్ బిజినెస్ మొదలుపెట్టిన సాఫీగా జరగడంలేదని టాక్ వినిపిస్తోంది.. ఇలా శోభా శెట్టి అనుకున్నవన్నీ జరగకపోవడంతో డిప్రెషన్ లోకి  వెళ్లిందంటూ ప్రచారం జరుగుతున్నది.. అందుకే సోషల్ మీడియాకు కొంత మేరకు గ్యాప్ ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: