గడచిన కొద్ది రోజుల క్రితం మంత్రి కొండా సురేఖ నాగార్జున కుటుంబం పైన చేసిన వ్యాఖ్యలకు అటు సినీ సెలబ్రిటీలే కాకుండా అభిమానులను కూడా ఫైర్ అయ్యేలా చేసింది. ఈ విషయంపై నాగార్జున పరువు నష్ట ధావ కూడా వేశారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన విమర్శలు చేసిన సందర్భంలో సమంత ,నాగచైతన్య విడాకుల పైన మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో విచారణ నడుస్తోంది.



ఈ క్రమంలోనే మంగళవారం అర్ధరాత్రి రోజున మంత్రి కొండా సురేఖ తన సోషల్ మీడియా వేదికగా నాగార్జునకు క్షమాపణలతో ఒక ట్విట్ చేసింది. ఈ వ్యాఖ్యలు  ఉద్దేశపూర్వకంగా చేయలేదని తనకు నాగార్జున గాని, ఆయన కుటుంబాన్ని కానీ కించపరచాలని ఆలోచన లేదంటూ తెలియజేసింది. తాను గతంలో చేసిన ఈ వ్యాఖ్యలను తాను ఉపసంహరించుకున్నట్లుగా తెలియజేసింది. ఈ సమయంలోనే నాగార్జునా పరువు నష్టం కేసును విత్డ్రా చేసుకున్నట్లుగా వినిపిస్తోంది. ఇందుకు సంబంధించి నాంపల్లి కోర్టుకు కూడా నాగార్జున తెలియజేశారట. మరి ఈ విషయంపై నాగార్జున అఫీషియల్ గా తెలియజేస్తారేమో చూడాలి. ఈ విషయం అటు ఇండస్ట్రీలో రాజకీయాలలో వైరల్ గా మారింది.



నాగార్జున ఈ ఏడాది కుబేర, కూలీ సినిమాలతో మంచి విజయాలను అందుకున్నారు. ప్రస్తుతం తన వందవ చిత్రాన్ని ప్రముఖ తమిళ డైరెక్టర్ రా కార్తీక్ తో చేయబోతున్నట్లుగా వినిపించాయి. స్క్రిప్ట్ పరంగా కూడా ఓకే అయినట్లుగా వినిపిస్తోంది. ఈ చిత్రంలో ఏకాంగ నాగార్జున ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేయబోతున్నట్లు వినిపిస్తున్నాయి. వందవ సినిమా కోసం అభిమానులు చాలా ఎక్సైటింగ్ గానే ఎదురు చూస్తున్నారు. నాగార్జున ఒకవైపు బిగ్ బాస్ షో కి హొస్టుగా వ్యవహరిస్తున్నారు. అలాగే శివ సినిమా రిలీజ్ సందర్భంగా ప్రమోషన్స్ లో కూడా బిజీగా ఉన్నట్టు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: