యాంకర్ శివజ్యోతి ఇటీవల తిరుమల శ్రీవారి దర్శనార్థం క్యూలైన్‌లో నిలబడి ఉండగా, టీటీడీ పాలక మండలి అందించే అన్నప్రసాదంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. “మేము రిచెస్ట్ బిచ్చగాళ్లమంటూ” చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో భక్తులు, హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. శ్రీవారి ప్రసాదాన్ని అవహేళన చేసినట్లుగా భావించిన భక్తులు ఆమెపై ప్రక్షాళన చేశారు. ఈ విమర్శల నేపథ్యంలో శివజ్యోతి వెంటనే క్షమాపణలు చెప్పినా, వివాదం పెద్ద ఎత్తున కొనసాగింది.
 

ఈ వివాదం కొంతకాలానికి తగ్గుముఖం పడుతుందని అనుకున్న సమయంలోనే, యాంకర్ శివజ్యోతి పై టీటీడీ అధికారుల కీలక నిర్ణయం తీసుకున్నట్టు మరో వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. తిరుమల శ్రీవారిని ఇకపై దర్శించుకునే అవకాశాన్ని పూర్తిగా నిలిపివేస్తూ, శివజ్యోతి యొక్క ఆధార్ కార్డ్‌ను టీటీడీ బ్లాక్ చేసిందన్న వార్తలు వేగంగా వైరల్ అయ్యాయి. శ్రీవారి ప్రసాదంపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యం లోనే ఈ చర్య తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. క్షమాపణలు చెప్పినప్పటికీ ఇది తేలికగా వదిలిపెట్టే అంశం కాదన్న భావనతో టీటీడీ కఠినంగా వ్యవహరించిందని సోషల్ మీడియాలో పలు పోస్టులు చెబుతున్నాయి.



ఈ వార్తలు బయటకు రావడంతో హిందూ సంఘాలు, భక్తులు టీటీడీ పాలక మండలి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు పోస్ట్‌లు చేస్తున్నారు. శ్రీవారి గౌరవాన్ని కాపాడడంలో నిర్వాహకులు తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనని, భవిష్యత్తులో ఎవరూ పవిత్రమైన ప్రసాదాన్ని లేదా దేవాలయ వ్యవస్థను అవమానించేలా మాట్లాడకూడదనే సందేశం స్పష్టంగా వెళ్లిందని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, సోషల్ మీడియాలో ఈ పరిణామం హాట్ టాపిక్‌గా మారింది. శివజ్యోతి చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వచ్చి ఉండగా, ఇప్పుడు వచ్చిన తాజా వార్తలతో ఈ వివాదం మరింత వేడెక్కింది.మొత్తానికి, శ్రీవారి ప్రసాదాన్ని అవహేళన చేసిన ప్రసంగం కారణంగా మొదలైన ఈ వివాదం, టీటీడీ తీసుకున్న కఠిన నిర్ణయంతో మరింత హాట్ టాపిక్‌గా మారింది. ఇదే సమయంలో అధికారికంగా టీటీడీ నుంచి స్పందన రానుండగా, నిజానిజాలు వెలుగులోకి రావడం కోసం భక్తులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: