"చిరంజీవికి ఒక అద్భుతమైన క్వాలిటీ ఉంది. అది ఆయన మాస్ అప్పీల్. ఆయనలో రజనీకాంత్ స్టైల్ మరియు నాలోని నటన.. ఈ రెండూ మేళవించి ఉంటాయి. ఆయన కనుక తమిళ ఇండస్ట్రీపై దృష్టి పెట్టి ఉంటే, అక్కడ కూడా మాకు గట్టి పోటీ ఇచ్చేవారు. బహుశా రజనీకాంత్, నేను ఇద్దరం కలిసి చేయాల్సిన పనిని ఆయన ఒక్కరే చేసేవారు" అని కమల్ కొనియాడారు.చిరంజీవి తమిళంలో ఎందుకు స్థిరపడలేదు అనేదానికి కమల్ ఒక లాజికల్ రీజన్ చెప్పారు. చిరంజీవి తన పునాదిని తెలుగు ఇండస్ట్రీలోనే గట్టిగా వేసుకోవాలని భావించారు. తెలుగు ప్రేక్షకులు ఆయనకు ఇచ్చిన గౌరవం, ప్రేమను చూసి ఆయన ఇక్కడే ఉండిపోవాలని ఫిక్స్ అయ్యారు. తమిళంలో అప్పటికే రజనీ, కమల్ మధ్య గట్టి పోటీ ఉండేది. చిరంజీవి అక్కడకు వెళ్లి ఉంటే ఆ పోటీ మరింత పెరిగేది, కానీ తన సొంత భాషా ప్రేక్షకులకు దూరం కాకూడదనే ఉద్దేశంతోనే ఆయన టాలీవుడ్కే పరిమితం అయ్యారని కమల్ విశ్లేషించారు.
ప్రస్తుతం చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' (MSG) చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టిస్తున్న ప్రభంజనం గురించి కూడా కమల్ ప్రస్తావించారు. "చిరంజీవిలో ఉన్న ఆ గ్రేస్ ఏమాత్రం తగ్గలేదు. అందుకే ఆయన ఇంకా రికార్డులు సృష్టిస్తున్నారు" అని ప్రశంసించారు. ఒకప్పుడు చిరంజీవిని తమిళ ఇండస్ట్రీ మిస్ చేసుకున్నా, ఇప్పుడు పాన్-ఇండియా సినిమాల వల్ల ఆ లోటు తీరుతోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.కమల్, చిరంజీవి మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'విక్రమ్' సినిమా సక్సెస్ సమయంలో చిరంజీవి స్వయంగా కమల్ను తన ఇంటికి పిలిచి సత్కరించడం అప్పట్లో వైరల్ అయ్యింది. ఇప్పుడు కమల్ చేసిన ఈ వ్యాఖ్యలు కూడా మెగా అభిమానులకు ఎంతో సంతోషాన్నిస్తున్నాయి. "మా బాస్ తలచుకుంటే ఏ ఇండస్ట్రీ అయినా ఆయనదే" అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
మొత్తానికి చిరంజీవి తమిళ సినిమాను ఏలకపోవడం వెనుక ఉన్నది భాషా సమస్య కాదు, కేవలం తన తెలుగు ప్రేక్షకులపై ఆయనకున్న ప్రేమే అని కమల్ హాసన్ మాటల్లో స్పష్టమైంది. బాస్ ఎక్కడ ఉన్నా 'మెగాస్టారే' అని లోకనాయకుడు చెప్పిన మాటలు అక్షర సత్యం!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి