ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యులో మంచు లక్ష్మి మాట్లాడుతూ అనగనగా ఒకదీరుడు సినిమా చేస్తున్న సమయంలో తనకి ఒక ఆరోగ్య సమస్య వచ్చిందని దాంతో ఇప్పటికి తాను బాధపడుతున్నానని తెలియజేసింది. అనగనగా ఒకదీరుడు సినిమా కోసం తాను మూడు గంటలపాటు మేకప్ వేసుకునే దాన్ని అలాగే తాను వేసుకొనే దుస్తులు కూడా బరువు ఎక్కువగా ఉన్న వాటిని మోసాను, మేకప్ తీసేస్తుంటే చాలా కష్టంగా ఉండేది. ఆ మేకప్, డ్రెస్, ఆభరణాల వల్ల తనకు మెడ నొప్పి వచ్చిందని తెలిపింది. అప్పుడు వచ్చిన ఆ మెడ నొప్పి ఇప్పటికే కూడా అలాగే ఉందని తెలియజేసింది.
అలాగే స్పాండిలైటిస్ కూడా వచ్చిందని అది ఇంకా ఇప్పటికి పోలేదు. దీంతో చాలా బాధపడుతున్నానని వెల్లడించింది మంచు లక్ష్మి. 2011లో అనగనగా ఒక ధీరుడు సినిమా విడుదల అయింది అంటే సుమారుగా ఇప్పటికీ 15 సంవత్సరాలుగా మంచు లక్ష్మి స్పాండిలైటిస్ అనే సమస్యతో ఇబ్బంది పడుతోంది. మంచు లక్ష్మి చివరిగా తెలుగులో దక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక తమిళంలో పూకి అనే సినిమాలో నటించింది. ప్రస్తుతం అయితే లేచింది మహిళా లోకం అనే తెలుగు సినిమాలో నటిస్తోంది. మంచు లక్ష్మి నిర్మాతగా కూడా తల చిత్రాలను తెరకెక్కించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి