ఇండియాలో కోవిడ్ 19 సెకండ్ వేవ్ ని ఒక విషాదం గా అభివర్ణించిన ఇండియన్ అమెరికన్ సర్జన్ డాక్టర్ వివేక్ మూర్తి.. కరోనా సంక్షోభంలో అన్ని దేశాల ప్రజలు ఒకరికొకరు సహాయం చేసుకోవాలని ఉద్ఘాటించారు.


కోవిడ్ 19 మనకి నేర్పించింది ఏమైనా ఉందా అని అంటే.. అది మనమందరం కలిసి మెలిసి ఐక్యమత్యం గా ఈ మహమ్మారిని పారద్రోలడమే. ప్రపంచ నలుమూలల ప్రతి ఒక్కరికి సరిపడా వ్యాక్సిన్ అందించేందుకు అన్ని దేశాలు సహాయపడాలి. పీపీఈ కిట్స్ ప్రజలందరికీ సరఫరా చేయాలి. ఏ దేశంలో కరోనా వైరస్ బతికి ఉన్నా అది ప్రపంచాన్ని మళ్ళీ పట్టి పీడించే ప్రమాదం ఉంది. అందువల్ల ఈ భూమ్మీద ఏ ప్రాంతంలోనూ కరోనా వైరస్ వ్యాప్తి ఉండకూడదు. ఈ మేరకు మనమందరం కరోనా పోరులో పాల్గొనాలి, " అని ఇండియన్-అమెరికన్ మూర్తి ఒక న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పుకొచ్చారు.



భారతదేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్నట్టు.. అమెరికాలో కూడా భవిష్యత్తులో కరోనా మళ్లీ విజృంభిస్తుందా? అని ఇంటర్వ్యూయర్ ప్రశ్నించగా..



"ఇండియా లాంటి భయంకరమైన పరిస్థితి అమెరికాలో రాకూడదని నేను బలంగా ఆశిస్తున్నాను. కానీ కరోనా మహమ్మారి అమెరికాలో ఆందోళనకర స్థాయిలో విజృంభించే అవకాశం ఉంది. ఆ విషయం గుర్తు పెట్టుకొని మన జాగ్రత్తలో మనం ఉండటం అత్యంత అవసరం. వ్యాక్సినేషన్ ప్రక్రియ పట్ల చూపించే కృషి వల్ల అమెరికా దేశం కరోనా నుంచి బయట పడగలదని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను" అని డాక్టర్ వివేక్ మూర్తి సమాధానం ఇచ్చారు.



"భారతదేశంలో జరిగేవన్నీ కూడా చాలా విషాదకరమైన సంఘటనలు. భారత్ రెండు సవాళ్ళను ఎదుర్కొంటోంది. కరోనా వేరియంట్లు పరంగా మాట్లాడుకుంటే.. B117 వేరియంట్ భారత దేశ వ్యాప్తంగా ప్రబలుతోంది. గతేడాది అమెరికా ని గడగడలాడించిన కరోనా వేరియంట్ కంటే ఈ B117 వేరియంట్ 50 శాతం లేదా అంతకంటే ఎక్కువగా సంక్రమించే సామర్థ్యం కలిగినది" అని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: