అయితే ఈ వేడుకలను అక్కడ ఉన్న తెలుగు వారు ఆన్లైన్ వీడియో కాల్ ద్వారా ప్రముఖ కవి గరికపాటి నరసింహారావు ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. గరికపాటి దాదాపుగా ఒకటిన్నర గంటల పాటు తన ప్రవచనాలను ప్రజలకు వినిపించారు. ఇందులో ముఖ్యంగా వినాయకునికి సంబంధించిన "ముదాకరాత్తమోదకం" అను స్తోత్రానికి అర్థం చెబుతూ సాగించిన ప్రసంగం అక్కడి వినాయక భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ స్తోత్రాన్ని మన నిజ జీవితానికి ముడి పెడుతూ ఆయన వివరించిన ఎన్ని జీవిత సత్యాలు అందరినీ ఆనందింపచేశాయి. మనకు దక్కిన ఈ చిన్న జీవితాన్ని ఎలా బ్రతకాలి అనే విషయాన్ని కూడా వివరించారు గరికపాటి.
గరికపాటి స్తోత్రాల ద్వారా గణేశుని దీవెనలతో పాటు నిజ జీవిత సత్యాలను తెలుసుకున్నాడు నందుకు చాలా సంతోషంగా ఉందని కళాసారధి అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ దేవుని కార్యక్రమాన్ని దేశ దేశాల్లో ఉన్న భక్తులందరూ తిలకించడానికి లైవ్ టెలి కాస్ట్ చేశారు. శ్రీ సాంస్కృతిక కళాసారధి సభ్యులంతా వీడియో కాల్ లో పాల్గొన్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు అధ్యక్షులు రత్న కుమార్. మరియు ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ కావడానికి స్పాన్సర్ చేసిన గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ సింగపూర్ మరియు ఈగ జూస్ సంస్థలకు శ్రీ సాంస్కృతిక కళాసారధి సభ్యులు అంతా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశారు.