విక్టరీ వెంకటేష్ , మీనా జంటగా నటించిన  దృశ్యం సినిమా గుర్తుంది కదా ... దానికి సీక్వెల్ తీస్తే ఎలా ఉంటుందో హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రజిత హత్యోదంతం అలాగే ఉందని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ అంటున్నారు . దృశ్యం చిత్రం కూడా ఒక యువకుడిని హత్య చేసి శవాన్ని  మాయం చేసే సంఘటన చుట్టూ దర్శకురాలు  అల్లుకున్న కథ కాగా , రజిత హత్యోదంతం లో కూడా నిందితులు ఆమెను చంపి శవాన్ని మాయం చేసి తప్పించుకునే ప్రయత్నాన్ని చేశారు .


 ఈ నెల 19  వ తేదీన రజిత ను హత్య చేసిన కీర్తి , శశి కుమార్ , మూడు రోజుల తరువాత రామన్నపేట రైల్వే ట్రాక్ పై పడేసి , మిస్సింగ్ కేసు పెట్టి తప్పుంచుకునే ప్రయత్నం చేశారని మహేష్ భగవత్ వెల్లడించారు . కీర్తి , బాల్ రెడ్డి అనే వ్యక్తిని ప్రేమించడం తో ఇద్దరికీ పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు . ఈ క్రమం లో బాల్ రెడ్డి , కీర్తిపై అత్యాచారం చేయడం తో ఆమె గర్భం దాల్చింది . కీర్తి కి శశి కుమార్ దగ్గరుండి అబార్షన్ చేయించాడు . ఈ విషయాన్ని అలుసుగా తీసుకుని కీర్తికి తరుచూ బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు .  


 కీర్తి ఆస్థి పై కన్నేసిన శశి కుమార్ ఆమెను పెళ్లి చేసుకోవాలని పథకం వేశాడు . అయితే ఆమె తల్లి రజిత వారి  పెళ్ళికి అడ్డు చెప్పడం తో, ఎలాగైనా ఆమె ను హత్య చేసి అడ్డు తొలగించుకోవాలని  నిర్ణయించుకున్నాడు . ప్రేయసి సహకారం తో రజిత ను హత్య చేశాడని మహేష్ భగవత్ వివరించాడు . కీర్తి పై అత్యాచారం చేసిన బాల్ రెడ్డి ని, రజిత ను హత్య చేసిన కీర్తి , శశి కుమార్ లను రిమాండ్ కు తరలించినట్లు చెప్పాడు .


మరింత సమాచారం తెలుసుకోండి: