కరోనా విజృంభిస్తున్న కాలంలో దేశంలో లాక్ డౌన్ విధించారు. దేశంలో లాక్ డౌన్ విధించడం వలన ప్రజలు చాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లాక్ డౌన్ సమయంలో మహిళలు ఇబ్బంది పడకూడదనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే తాజగా కేంద్ర ప్రభుత్వం చౌక ధరకే న్యాప్కిన్స్ అందిస్తోందన్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన్ మంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రాలకు కేంద్రం శానిటరీ న్యాప్కిక్స్ అందిస్తోందని తెలిపారు. మార్కెట్ ధర కన్నా వీటి ధర చాలా తక్కువగా ఉంటుందన్నారు. జన్ ఔషధి కేంద్రాలకు వెళ్లి కేవలం రూ.1కే న్యాప్కిన్స్ కొనుగోలు చేయొచ్చునని తెలిపారు.
మార్కెట్లో శానిటరీ న్యాప్కిన్ ధర రూ.8 వరకు ఉంటుందన్నారు. అదే మీరు ఇక్క రూ.1కే కొనొచ్చునాని అధికారులు తెలిపారు. కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంలో మహిళలు ఇబ్బంది పడుతున్న విషయం అందిరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వారికి ఎక్కువ ఇబ్బంది ఉండొచ్చు. అందువల్ల జన్ ఔషధి సెంటర్లకు వెళ్లి న్యాప్కిన్స్ను రూ.1కే కొనొచ్చునన్నారు.
మహిళల ఆరోగ్యం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 2018లోనే జనఔషధి సువిధ ఆక్సో బయోడీగ్రేడబుల్ శానిటరీ న్యాపిక్స్ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించిందన్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా జనఔషధి కేంద్రాల ద్వారా 4.6 కోట్ల న్యాప్కిన్స్ను విక్రయించారు. కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్ట్లో న్యాప్కిన్ ధరను రూ.1కి తగ్గించిందని తెలిపారు.
ఈ న్యాప్కిన్స్ వల్ల పర్యావరణానికి వచ్చిన ముప్పు ఏమీ లేదన్నారు. ఇది బయలాజికల్లీ డీగ్రేడబుల్ ఆక్సో బయోడీగ్రేడబుల్ మెటీరియల్తో తయారు అవుతాయి. ఏఎస్టీఎం డీ6954 ప్రమాణాలకు అనుగుణంగా తయారు అవుతాయన్నారు. కోవిడ్ 19 లాక్ డౌన్ పరిస్థితుల్లోనూ జనఔషధి కేంద్రాలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయన్నారు. అందువల్ల ఎవరైనా తక్కువ ధరకే న్యాప్కిన్స్ కొనుగోలు చేయాలని భావిస్తే.. జనఔషధి కేంద్రాలకు వెళ్లొచ్చునన్నారు.