పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మల్లాపూర్ డివిజన్ దుర్గానగర్ కు చెందిన ప్రశాంతి, రవి దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె స్నేహ (11) ఉన్నారు. శనివారం తల్లిండ్రులు పనికి వెళ్లడంతో స్నేహా అన్నతో పాటు ఇంట్లోనే ఉంది. ఆరోజు బక్రీద్ సందర్భంగా పక్కింట్లో ఉంటే ఓ ముస్లిం కుటుంబం వారికి బిర్యానీ ఇచ్చింది. ఆ తర్వాత కొద్ది సేపటికి సోదరుడు ఆడుకునేందుకు బయటికి వెళ్లగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో స్నేహ టవల్ తో డోర్ హ్యాండిల్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
దీంతో బిర్యానీ తినే విషయంలో అన్నతో స్నేహ గొడవ పడింది. కాసేపటికే అన్న స్నేహితులతో ఆడుకునేందుకు బయటికి వెళ్లగా స్నేహ ఇంట్లోనే టవల్తో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాసేపటి తర్వాత ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు ఉరికి వేలాడుతున్న ఆమెను చూసి షాకయ్యారు. వెంటనే నాచారంలోని ఈఎస్ఐ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతురాలి తల్లి ప్రశాంతి ఫిర్యాదు మేరకు నాచారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టు నిమిత్తం