నీటి ప్రాజెక్టుల విషయంలో కేంద్రం వైఖరిపై కేసీఆర్ మండిపడిన సంగతి తెలిసిందే. ‘శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసేవిషయంలో కూడా కేంద్రం అనవసరంగా అభ్యంతరం పెడుతోం ది. వాస్తవానికి సాగర్ నింపిన తర్వాతే మిగిలిన ప్రాజెక్టులు నిండాలి. అసలు శ్రీశైలం ప్రాజెక్టు నీటిపారుదల ప్రాజెక్టు కాదు. అది జలవిద్యుత్ ప్రాజెక్టు. ఇన్ని వాస్తవాలు పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం అభ్యంతరాలు వ్యక్తంచేయడం సమంజసం కాదు. ఒక రాష్ట్రంగా తెలంగాణకు కూడా హక్కులుంటాయి. రాష్ర్టా ల హక్కులను హరించేలా కేంద్రం వ్యవహరించడం తగదు. కేంద్రవైఖరిని కూడా యావత్దేశానికి తెలిసేలా చేస్తాం’ అని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
ఈ సమావేశం జరిగిన మరుసటి రోజైన మంగళవారం పది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కరోనాపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో కరోనా పరిస్థితిని వివరించారు. దేశంలో వైద్య సదుపాయాలను పెంచాల్సిన అవసరాన్ని కరోనా గుర్తు చేసిందని సీఎం కేసీఆర్ అన్నారు. కరోనా అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని, దేశంలో వైద్య సదుపాయాలను పెంచే విషయంపై దృష్టి పెట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి సూచించారు. ‘‘కరోనా అనుభవాలు మనకు పాఠం నేర్పాయి. దేశంలో వైద్య సదుపాయాలు పెంచాల్సిన అవసరం ఉంది. వైద్య రంగంలో భవిష్యత్ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో విజనరీతో ఆలోచించాలన్నారు. సమగ్ర వైద్య సదుపాయాల కోసం ప్రణాళిక చేయాలి. కేంద్రాలు, రాష్ట్రాలు కలిసి ఈ ప్రణాళిక అమలు చేయాలని సీఎం పేర్కొన్నారు. గతంలో మనకు కరోనా లాంటి అనుభవం లేదు. ఈ పరిస్థితి ఎన్ని రోజులు ఉంటుందో తెలియదన్నారు. కాగా, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తమ వైఖరిని మరోమారు కేసీఆర్ స్పష్టం చేశారని అదే సమయంలో దేశం కోసం కూడా విలువైన సూచన చేశారని పలువురు విశ్లేషిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి