శేషాచలం ఎన్‌కౌంటర్‌కు నిరసనగా తమిళులు మళ్లీ ఆంధ్రా బస్సులపై దాడులు చేస్తున్నారు. సోమవారం సాయంత్రం కాళహస్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుపై ఆంధ్రా సరిహద్దు ప్రాంతమై న పన్నంగాడు వద్ద రాళ్లతో దాడి చేశారు. దీంతో బస్సు సిబ్బంది. తడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో చిత్తూరు డిపోకు చెందిన మరో ఆర్టీసీ బస్సును తమిళనాడు ప్రాంతంలో గుమ్మడిపూండి సమీపంలో చిన్న ఓబులాపురం వద్ద చెన్నైకు నుంచి తిరుమలకు వస్తున్న కాళహస్తి డిపో బస్సును బ్రిడ్జిపైనుంచి బస్సుపై రాళ్లు రువ్వారు. దీంతో బస్సు ముందు అద్దాలు ధ్వంసమయ్యాయి. డ్రైవర్ పి ఎం ఆర్ రెడ్డికి స్వల్పగాయాలు అయ్యాయి. దీంతో బస్సు సిబ్బంది ఆరంబాకం స్టేషన్‌లో ఫిర్యాదు చేసి తిరుమలకు బయలుదేరారు. ఇదే క్రమంలో కర్నూలు జిల్లా నంద్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుపై కూడా తమిళనాడు ప్రాంతంలోని చోళవరం వద్ద రాళ్లతో దాడి చేసినట్లు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: