దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన తర్వాత దేశం మొత్తం మోడీ వైపే చూస్తోందని, తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా విజయం సాధించి తీరతామని చెప్పారు. తీరా షెడ్యూల్ వచ్చిన తరువాత స్థానిక నేతల్ని కాదని కర్ణాటక చీఫ్ సెక్రటరీగా పదవీ విరమణ చేసిన రత్నప్రభను అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగింది. దుబ్బాక ఫలితం, జనసేన మద్దతు కలిసివస్తాయని నేతలు భావించారు. ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేతలు టీటీడీ కేంద్రంగా అనేక వివాదాలు సృష్టించారు. హిందుత్వం ఆధారంగా రాజకీయంగా లబ్ధిపొందాలని అనేక ఎత్తుగడలు వేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ప్రచారానికి తీసుకు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తరువాత వాస్తవికతను గ్రహించిన ఆయన పార్టీ రాష్ట్ర నేతలపై కోప్పడినట్లు సమాచారం అందుతుంది. క్షేత్రస్థాయిలో కమిటీలు కూడా ఏర్పాటు చేయకుండానే ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తున్నారు? ఏవిధంగా గెలుస్తామంటున్నారు? అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డట్లు తెలిసింది. ఏపీ బీజేపీ నేతలకు బాధ్యత లేదని పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఫలితాల తరువాత వీర్రాజుకు పదవీగండం ఉందనే వార్తలు వస్తున్నాయి.
దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన తర్వాత దేశం మొత్తం మోడీ వైపే చూస్తోందని, తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా విజయం సాధించి తీరతామని చెప్పారు. తీరా షెడ్యూల్ వచ్చిన తరువాత స్థానిక నేతల్ని కాదని కర్ణాటక చీఫ్ సెక్రటరీగా పదవీ విరమణ చేసిన రత్నప్రభను అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగింది. దుబ్బాక ఫలితం, జనసేన మద్దతు కలిసివస్తాయని నేతలు భావించారు. ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేతలు టీటీడీ కేంద్రంగా అనేక వివాదాలు సృష్టించారు. హిందుత్వం ఆధారంగా రాజకీయంగా లబ్ధిపొందాలని అనేక ఎత్తుగడలు వేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ప్రచారానికి తీసుకు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తరువాత వాస్తవికతను గ్రహించిన ఆయన పార్టీ రాష్ట్ర నేతలపై కోప్పడినట్లు సమాచారం అందుతుంది. క్షేత్రస్థాయిలో కమిటీలు కూడా ఏర్పాటు చేయకుండానే ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తున్నారు? ఏవిధంగా గెలుస్తామంటున్నారు? అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డట్లు తెలిసింది. ఏపీ బీజేపీ నేతలకు బాధ్యత లేదని పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఫలితాల తరువాత వీర్రాజుకు పదవీగండం ఉందనే వార్తలు వస్తున్నాయి.