ఢిల్లీ : రఘురామ కృష్ణంరాజు మరియు ఓ ప్రముఖ ఛానెల్‌ అధినేత మధ్య హవాలా లావాదేవీల వ్యవహారం ఉన్నట్లు... రూ.11 కోట్లు (లక్ష యూరోలు) హవాలా లావాదేవీలకు వీరిద్దరూ పాల్పడినట్లు ఏపి సిఐడి వద్ద ఆధారాలు ఉన్నట్లు వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో ఉన్న వైసీపీ ఎంపీలు... నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు హవాలా లావాదేవీల పై ప్రధానికి 14 పేజీల లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.  అలాగే, కేంద్ర ఆర్థిక మంత్రి  నిర్మల సీతారామన్ ను కలిసి ఫిర్యాదు అందజేసి హవాలా లావాదేవీలపై వివరించారు వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు.

అలాగే... ఈ ఫిర్యాదు తో పాటు కీలక ఆధారాలు సమర్పించారు వైసీపీ ఎంపీలు. నర్సాపురం ఎమ్.పి రఘురామకృష్ణంరాజు,  ఓ ప్రముఖ ఛానెల్‌ అధినేత మధ్య లక్ష యూరో ల హవాలా  లావాదేవీలు జరిగాయని కేంద్ర మంత్రి నిర్మాలా సీతారామన్‌ కు వివరించారు. ఈ లావాదేవీలకు సంబంధించి సిఐడి  వద్ద కూడా పూర్తి ఆధారాలు ఉన్నాయని... ఏకంగా 11 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని నివేదికలో వెల్లడైందని ఎంపీలు వివరించారు. రఘురామకృష్ణంరాజు ,  ప్రముఖ ఛానెల్‌ అధినేత  పైన అక్రమ నగదు చలామణి చట్టం , “ఫెమా” కింద కేసులు నమోదు చేయాలని ఈ సందర్భంగా వైసీపీ ఎంపీలు డిమాండ్‌ చేశారు.

అంతేకాదు... దేశం విడిచి పారి పోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని... వీరిద్దరినీ కస్టడీలోకి తీసుకుని అక్రమ లావాదేవీల గుట్టు బయటకు తీయాలని వారు కోరారు. ఈ ఆరోపణలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని వైసీపీ ఎంపీలు కోరారు. అలాగే.. పోలవరం, ప్రత్యేకహోదా అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ఈ సందర్భంగా చర్చించారు వైసీపీ ఎంపీలు.  పోలవరం సవరించిన అంచనా వ్యయం  55,656  కోట్ల రూపాయలకు ఆమోదం తెలపాలని ఓ లేఖ సమర్పించారు.  రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తాన్ని తక్షణమే రియంబర్స్‌ మెంట్‌ విడుదల చేయాలని కోరిన వారు.... 2013 భూసేకరణ చట్టం ఆధారంగా  సహాయ, పునరావాస ప్యాకేజీ ని అమలు చేయాలన్నారు.  2022 కల్లా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుందని తెలిపారు.








మరింత సమాచారం తెలుసుకోండి: