ప్రధానంగా ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ స్కూల్స్ లో కేసులు క్రమంగా పెరగడం సమస్య అయింది. అటు టీచర్లకు కూడా కరోనా పెద్ద సమస్యగా మారింది అనే చెప్పాలి. పలువురు టీచర్లు కూడా స్కూల్ కి రావడం లేదు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు అంటున్నారు. ఇక ఇదిలా ఉంటె జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 156 చేరిన కరోనా కేసులు.. తల్లి తండ్రులను మరింతగా భయపెడుతున్నాయి. ఒకే రోజు అత్యధికంగా 20 కేసులు నమోదు అయ్యాయని అధికారులు పేర్కొన్నారు. వారిలో నలుగురు ఉపాద్యాయులు, 16 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది.
మద్దిపాడు మండలం నేలటూరు యంపీయూపీ స్కూల్ లో నలుగురికి కరోనా వచ్చింది. ఉలవపాడు మండలం వీరేపల్లి మోడల్ స్కూల్ లో నలుగురికి వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. కొండపి మండలం పెట్లూరు జెడ్పీ హైస్కూల్ లో ముగ్గురికి కరోనా సోకింది. పొన్నలూరు మండలం పి.అగ్రహారం స్కూల్ లో నలుగురికి, విప్పగుంట ఎంపీపీఎస్ లో ఒకరికి వచ్చిందని కనిగిరి మొదటి వార్డు ఎంపీ స్కూల్ లో ఇద్దరికి వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. నాగులుప్పలపాడు మండలం వినోదరాయునిపాలెం స్కూల్, హెచ్.నిడమానూరు ఎయిడెడ్ స్కూల్ లో ఒకరికి చొప్పున కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టుగా అధికారులు పేర్కొన్నారు. పాఠశాలల్లో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులతో ఇతర ఉపాద్యాయులు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.