టీటీడీ అధికారులు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఢిల్లీలోని టీటీడీ శ్రీవెంకటేశ్వర కాలేజీలో సోలార్ ప్లాంట్ ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. 139 కేవీఏ సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటు చేసామని ఆయన తెలిపారు. టీటీడీ కళాశాలలో ఇప్పటి వరకు యూనిట్ విద్యుత్‌కు రూ. 11.50 చెల్లిస్తున్నాం అని అన్నారు. ఇప్పుడు సోలార్ పవర్ ప్లాంట్‌తో యూనిట్ ఖర్చు రూ. 3.33కు తగ్గింది అని ఆయన తెలిపారు. మొత్తంగా కళాశాలపై విద్యుత్తు బిల్లుల భారం నెలకు రూ. లక్షకు పైగా తగ్గింది అని ఆయన వ్యాఖ్యానించారు.

కళాశాల భవనాల పైకప్పును సోలార్ పవర్ ఉత్పత్తి చేసే సంస్థకు ఇచ్చాం అని వివరించారు. విద్యుత్ ఉత్పత్తి, ప్లాంట్ నిర్వహణ మొత్తం ఆ సంస్థ చూసుకుంటుంది అన్నారు . సోలార్ ప్లాంట్ ఏర్పాటుతో పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతోంది అని తెలిపారు. 190 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ విడుదలను ఈ ప్లాంట్ నిరోధిస్తుంది అని పేర్కొన్నారు. కొన్ని వేల మొక్కలు నాటడం వల్ల కలిగే ప్రయోజనం ఈ ప్లాంటుతో కల్గుతుంది అన్నారు. వెంకటేశ్వర కాలేజి అడ్మిషన్లలో తెలుగువారికి కోటా లేకుండా పోయింది అని ఆయన వివరించారు.

ఢిల్లీ యూనివర్సిటీ నిబంధనలు మార్చడంతో సీట్లన్నీ యూనివర్సిటీ ద్వారా భర్తీ అవుతున్నాయి అన్నారు. గతంలో ఉన్న మాదిరిగా కళాశాల యాజమాన్యానికి సీట్లను రిజర్వ్ చేయమని కోరాము అని ఆయన పేర్కొన్నారు. తద్వారా ఢిల్లీలో ఉంటున్న తెలుగువారికి అడ్మిషన్ కల్పించడం సాధ్యపడుతుంది అని వివరించారు. అయితే టీటీడీ కాలేజికి అవకాశమిస్తే, మిగతా కాలేజీలు కూడా యాజమాన్య కోటా కావాలని పట్టుబడతాయంటూ ఢిల్లీ యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు అని నాణ్యతా ప్రమాణాలు పడిపోకుండా ఉండడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని అంటున్నారు అన్నారు. ఏదేమైనా తెలుగు విద్యార్థుల ప్రయోజనాలు కాపాడేందుకు మేం కృషి చేస్తాం అని స్పష్టం  చేసారు. వెంకటేశ్వర కళాశాల ర్యాంకింగ్ గతం కంటే చాలా మెరుగుపడింది అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap