ఈ విషయంపై ఇప్పటికే స్పందించిన పలు దేశాలు తాము తాలిబాన్ల ప్రభుత్వానికి వ్యతిరేకం అంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు అన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో అటు తీవ్రవాదానికి కేరాఫ్ అడ్రస్ అయిన పాకిస్థాన్ మాత్రం తాలిబన్లకు మద్దతు ఇస్తూ ఉండడం గమనార్హం. ఇక రానున్న రోజుల్లో అంతర్జాతీయ సమాజం తాలిబన్ల ప్రభుత్వాన్ని ఎలా చూడబడుతుంది అన్నది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. అదే సమయంలో ఇక ప్రపంచ దేశాలతో సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు అటు తాలిబన్లు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవలే తాలిబన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి చేసిన వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారిపోయాయి. తాము భారత్ సహా ఏ దేశంలోనూ విరోధం కోరుకోవడం లేదు అంటూ తాలిబన్ విదేశాంగ మంత్రి స్టేట్మెంట్ ఇచ్చారు. ముఖ్యంగా భారత్తో సన్నిహిత సంబంధాలను కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలను దూరం పెడుతున్నారు అన్న వార్తలను తోసిపుచ్చారు తాలిబాన్ విదేశాంగ శాఖ మంత్రి అమీర్ ఖాన్. మహిళలు ప్రస్తుతం వైద్య రంగంలో 100 శాతం పనిచేస్తున్నారని విద్యారంగం సహా అన్ని రంగాల్లో కూడా మహిళలకు సముచిత స్థానం కల్పిస్తూ ఉన్నాము అంటూ ఆయన చెప్పుకొచ్చారు.