ఇక దంపతులుగా విడిపోయినా కాని తమ సేవా గుణాన్ని వీడడం లేదు బిల్ గేట్స్ దంపతులు. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.కరోనా వైరస్ మహమ్మారి పోరుకు భవిష్యత్తులో ఇటువంటి వైరస్ మహమ్మారులను ఎదుర్కొనేందుకు బిల్ గేట్స్ ఆయన భార్య మిలిండా గేట్స్ భారీ మొత్తంలో 150 మిలియన్ డాలర్ల డబ్బును అందించడం జరిగింది.ఇక  గేట్స్ ఫౌండేషన్ బ్రిటీష్ బయోమెడికల్ చారిటీ వెల్ కమ్ కంపెనీలో చెరో 150 మిలియన్ డాలర్లుతో కలిపి మొత్తం 300 మిలియన్ డాలర్ల డబ్బును అందించడం అనేది జరిగింది.ఇక ఈ మొత్తం డబ్బులు కూడా ఐదేళ్ల క్రితం స్థాపించిన కొల్లినేషన్ ఫర్ ఎపిడమిక్ ప్రిపెడ్ నెస్ ఇన్నోవేషన్ (సీఈపీఐ)కి వెళుతాయి.ఇక ఈ సంస్థకు కోవాక్స్ సహా నేతృత్వం వహిస్తుంది.

అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాక్సిన్ కూటమి తోపాటు అభివృద్ధి చెందుతున్న ప్రపంచానికి కరోనా వైరస్ మహమ్మారి వ్యాక్సిన్లను అందించడంలో ఈ సంస్థ మంచిగా చొరవ చూపిస్తుంది.కరోనా వైరస్ మహమ్మారి యొక్క ఆందోళన వేరియంట్ ఒమిక్రాన్ చివరి వేరియంట్ అవుతుందని ఎవ్వరూ విశ్వసించరని వెల్ కమ్ డైరెక్టర్ ఇంకా అలాగే బ్రిటీష్ శాస్త్రవేత్త జెరెమీ ఫర్రార్ తెలిపారు. మాకు ప్రపంచ స్పందన అవసరమని అలాగే ప్రభుత్వాలు తమ సహకారాన్ని పెంచాలని ఆయన కోరడం జరిగింది.ఇక బిల్ గేట్స్ జంట విడిపోకముందు కూడా చాలా రకాల సహాయాలు చేశారు. 

మిలిండా గేట్స్ గారు ఫౌండేషన్ ద్వారా ప్రపంచావ్యాప్తంగా కోట్ల డాలర్లు విరాళాలు చేసి సహాయం అందించడం జరిగింది. ఇక ఇలా ఈ జంట తమ సేవాగుణంతో తమ దాతృత్వాన్ని చాటుకుంటూ ప్రజల మన్ననలను అందుకుంటున్నారు.బిల్ గేట్స్ తన సేవలతో నిజమైన అపర కుబేరుడుగా మొదటి నుంచి కూడా మంచి పేరు ప్రఖ్యాతలతో దూసుకుంటూ పోతున్నాడు.భావి తరాలకు గొప్ప ఆదర్శంగా ఈయన నిలుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: