పదవ తరగతి పరీక్షలు ఆలస్యం అవుతున్నందున పాఠశాలలను వచ్చే నెల ఏప్రిల్ ఆఖరి వరకు నడిపి మే మొదటి వారం నుండి వేసవి సెలవులను ఇవ్వాలని విద్యా సంస్థలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తుది నిర్ణయం అధికారుల చేతిలో ఉండనుంది. కాగా పదవ తరగతి పరీక్షలు లేట్ అవుతున్న కారణంగా ఏప్రిల్ ఎండింగ్ వరకు వర్కింగ్ డేస్ గా పరిగణలోకి తీసుకుని మే లో సెలవులు ఇచ్చి మళ్ళీ జూలై మొదటి వారం లో తిరిగి పాఠశాలలను ప్రారంభించనున్నారు అని సమాచారం.
సాధారణం గా జూన్ 12 నుండి ప్రతి ఏడు పాఠశాలలు తిరిగి రీఓపెన్ చేస్తారు అయితే 10 వ తరగతి పరీక్షలు లేట్ అవుతున్నందున మే మొదటి వారం లో సెలవులు ఇచ్చి అనంతరం జూన్ చివరి వరకు కూడా సెలవులను కొనసాగించి తిరిగి జూలై లో స్కూల్స్ రీ ఓపెన్ చేయడానికి ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇంటి పూట బడుల విషయానికొస్తే ఈ పాటికే మొదలయ్యి ఉండాలి కానీ...వచ్చే నెల మొదటి వారం నుండి నిర్వహించాలని అధికారులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకో రెండు మూడు రోజుల్లో ఈ విషయాలపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం.