తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య తీవమైన రాజకీయ యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే...నువ్వా-నేనా అన్నట్లు రెండు పార్టీల నేతల మధ్య వార్ జరుగుతుంది...బీజేపీ ఏమో...రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శలు చేస్తుంటే..టీఆర్ఎస్ ఏమో...కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శలు చేస్తుంది. ఇలా రెండు పార్టీల మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది..అలాగే నేతల మధ్య సవాళ్ళు-ప్రతి సవాళ్ళు కూడా నడుస్తున్నాయి..ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్..బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఒక సవాల్ విసిరారు.. దమ్ముంటే కరీంనగర్ అసెంబ్లీలో తమ మంత్రి గంగుల కమలాకర్‌పై బండి సంజయ్ గెలవాలని సవాల్ విసిరారు..పార్లమెంట్ ఎన్నికల్లో ఏదో సుడి కొద్ది ఎంపీగా గెలిచారని, కానీ ఎమ్మెల్యేగా గెలిచి చూపించాలని సవాల్ చేశారు.

వాస్తవానికి కరీంనగర్ అసెంబ్లీలో బండి వరుసపెట్టి గంగులపై ఓడిపోతున్నారు...2009, 2014, 2018 ఎన్నికల్లో వరుసగా ఓడిపోతూ వస్తున్నారు. గత ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీలో బండి విజయం ఖాయమని అంతా అనుకున్నారు...కాకపోతే కేసీఆర్ సెంటిమెంట్ లేపడంతో బండి ఓటమి పాలయ్యారు. కేసీఆర్ గాలిలో ఓడిపోయారు. అయితే ఈ సారి కేసీఆర్ గాలి తక్కువ ఉంది...అటు బీజేపీ హవా పెరుగుతుంది. ఈ పరిణామాలని బట్టి చూస్తే కరీంనగర్ అసెంబ్లీలో గంగుల హవా తగ్గేలా ఉంది..వరుసగా గెలుస్తూ వస్తున్న నేపథ్యంలో గంగులపై సహజంగానే వ్యతిరేకత కనిపిస్తోంది...ఇటు వరుసగా ఓడిపోతున్న సానుభూతి బండిపై ఉంది..పైగా ఇప్పుడు ఆయన బీజేపీ అధ్యక్షుడుగా ఉన్నారు.

అధ్యక్షుడుగా ఇంకా దూకుడుగా రాజకీయం చేస్తున్నారు...పైగా ఆయన సీఎం అభ్యర్ధుల్లో ఒకరుగా ఉన్నారు..ఈ పరిణామాలు బండికి బాగా కలిసొచ్చేలా ఉన్నాయి..ప్రస్తుతం ఎంపీగా ఉన్న బండి..నెక్స్ట్ మళ్ళీ కరీంనగర్ అసెంబ్లీలో పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది..అయితే వేములవాడలో కూడా పోటీ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.. కానీ కరీంనగర్ అసెంబ్లీపై కూడా బండి ఫోకస్ ఉందని, ఓడిన చోటే గెలవాలని బండి భావిస్తున్నట్లు అర్ధమవుతుంది..మొత్తానికి ఈ సారి గంగులకు బండి ఛాన్స్ ఇచ్చేలా లేరు.  


మరింత సమాచారం తెలుసుకోండి: