ఇక ట్రాఫిక్‌లో సిగ్నల్‌ జంప్‌ చేయడమే కాకుండా పోలీసులతో చాలా అసభ్యంగా ప్రవర్తించింది ఓ యువతి. నా కారునే ఆపుతావా అసలు నేనెవరో తెలుసా అంటూ ఆ పోలీసుపై కస్సుబుస్సుమంటూ మండిపడింది.కేవలం తప్పు చేసి తప్పించుకోవడమే కాకుండా పోలీసులపై ఫైర్‌ అయిన ఆ యువతి ఓ ప్రజా ప్రతినిధి కుమార్తె అవ్వడం మరో విశేషం. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అయిన అరవింద్ లింబావలీ కూతురు తన బీఎండబ్ల్యూ కారు డ్రైవ్‌ చేస్తూ రోడ్డుపైకి వచ్చింది. ఇక ఓ చోట రెడ్‌ సిగ్నల్‌ పడినా కూడా ఆగకుండా రయ్‌మంటూ దూసుకెళ్లింది.ఇది తెలిసిన ట్రాఫిక్‌ పోలీస్‌ ఆమె కారును ట్రేస్‌ చేసి రాజ్‌భవన్‌ రోడ్డు వద్ద ఆమెను ఆపారు.ఆమె కారును పోలీసులు అడ్డుకోవడంతో చిర్రెత్తిన ఆ ఎమ్మెల్యే కుమార్తె నా కారే ఆపుతావా అంటూ పోలీసులతో చాలా అనుచితంగా ప్రవర్తించింది. 'అసలు నేనే ఎవరో తెలుసా. నేను ఇక ఇప్పుడు వెళ్లాలి. నా కారును అసలు ఆపోద్దు. ఓవర్‌టేక్ చేసినందుకు నాపై నువ్వు కేసు పెట్టలేవు. ఎందుకంటే ఇది ఎమ్మెల్యే వాహనం.


ఇక మా నాన్న అరవింద్ లింబావలీ' అంటూ పోలీసులపై రెచ్చిపోయింది. అంతటితో కూడా ఆమె ఆగకుండా అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులతోనూ గొడవ పడింది. దీంతో రాజ్‌భవన్‌ వద్ద జనాలు గుమిగూడటంతో కాసేపు ఈ వాగ్వాదం అనేది చోటుచేసుకుంది.కాగా ఆ యువతి కార్లో సీట్‌ బెల్టు కూడా పెట్టుకోలేదని తెలిసింది. అయితే ఆమె మాటలు పట్టించుకొని పోలీసులు ఆ యువతికి జరిమానా విధించారు అలాగే బీఎండబ్ల్యూ కారు నెంబర్‌పై చలాన్లు కూడా పరిశీలించగా దెబ్బకు పోలీసులు ఖంగుతున్నారు. ఆమె వాహనంపై మొత్తం 9 వేల రూపాయల చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు వారు గుర్తించారు.ఇక అంతేగాక ప్రస్తుతం ట్రాఫిక్‌ రూల్స్‌ అతిక్రమించినందుకు గాను నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ చేసినందుకు రూ. 1000 జరిమానా విధించారు. దీంతో మొత్తం 10 వేలను ఆమె నుంచి అక్కడ పోలీసులు రాబట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: