
ముఖ్యంగా థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా చేసే రెంట్ పేమెంట్స్ పై hdfc దృష్టి పెట్టింది. ఇప్పటికే ICICI, sbi ఈ తరహా పేమెంట్లపై ఛార్జీలు వసూలు చేస్తామని ప్రకటించాయి. తాజాగా hdfc సైతం అదే బాట పెట్టింది. ఒక క్యాలెండర్ నెలలో జరిపే రెండో అద్దె చెల్లింపులపై 1 శాతం ఫీజు వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. అలాగే, రివార్డు పాయింట్ల ప్రోగ్రామ్లో కొన్ని మార్పులు చేసింది. hdfc బ్యాంక్ స్మార్ట్బై పోర్టల్లో రివార్డు పాయింట్ల రీడీమ్పై పరిమితి విధించింది..ఇప్పుడు ఎటువంటి వాటి పై పరిమితి విధించింది అనేది తెలుసుకుందాం..
*. ఇన్ఫినియా కార్డుదారులు ఇకపై ఒక క్యాలెండర్ నెలలో విమానాలు, హోటళ్ల బుకింగ్పై గరిష్ఠంగా 1.50 లక్షల రివార్డు పాయింట్లు మాత్రమే రీడీమ్ చేసుకోగలరు. అలాగే డైనర్స్ బ్లాక్ కార్డు దారులు 75 వేలు, మిగిలిన కార్డు హోల్డర్లు 50 వేల పాయింట్లు మాత్రమే రీడీమ్ చేసుకోగలరని హెచ్డీఎఫ్సీ పేర్కొంది.