ఇక డిజిటల్  పేమెంట్స్ రంగంలో ప్రధాని నరేంద్ర మోదీ, సింగపూర్ ప్రధాన మంత్రి లీ సీన్ లూంగ్ ఈరోజు భారీ ఒప్పందంపై సైన్ చేశారు. ఇండియా యూపీఏ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్, సింగపూర్‌లోని PayNowని కనెక్ట్ చేయడం ద్వారా రెండు దేశాల మధ్య క్రాస్-బోర్డర్ పేమెంట్ కనెక్టివిటీ స్టార్ట్ చెయ్యబడింది.ఈ రోజు ఈ ఉదయం పూట రెండు దేశాల ప్రధానులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక ఇరు దేశాల అధికారులు డిజిటల్ చెల్లింపు ఒప్పందాన్ని స్టార్ట్ చేశారు. ఈ సదుపాయాన్ని ఇండియా నుంచి ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇంకా సింగపూర్ నుంచి మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ మేనేజింగ్ డైరెక్టర్ రవి మీనన్ స్టార్ట్ చేశారు.ఇండియా – సింగపూర్ మధ్య రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్ లింకేజీ  స్టార్ట్ చేశారు. దీని ద్వారా ఇండియా- సింగపూర్ మధ్య సరిహద్దు కనెక్టివిటీ కింద డబ్బును చాలా సులభంగా ఇంకా అలాగే చాలా త్వరగా కూడా బదిలీ చేయవచ్చు. 


ఇక స్మార్ట్‌ఫోన్ ని వాడే ప్రతి ఒక్కరు కూడా యూపీఐ సేవలను వినియోగించుకుంటున్నారు. వీటివల్ల బ్యాంకులతో పనిలేకుండానే ఆర్థిక లావాదేవీలను చాలా సులభంగా ఇంకా త్వరగా చేయడానికి అవకాశం ఉండడంతో యూపీఐ సేవలకు మంచి ప్రజాధారణ అనేది లభించింది.ఇక ఇప్పుడు రెండు దేశాల మధ్య డిజిటల్ లావాదేవీలు చాలా ఈజీగా ఉంటాయి..ఈరోజు నుండి, UPI, PayNow ఉపయోగించి, సింగపూర్‌లో నివసిస్తున్న భారతీయులు UPI ద్వారా ఇండియాకి ఈజీగా డబ్బును బదిలీ చేయగలరు. ఇంకా అలాగే సింగపూర్‌లో చదువుతున్న మన భారతీయ విద్యార్థులు ఇంకా వారి తల్లిదండ్రులు కూడా చాలా త్వరగా అలాగే చాలా సులభంగా డిజిటల్ చెల్లింపులు చేసుకోవచ్చు. ఇలా చాలా ఈజీగా తల్లి దండ్రులు UPI ద్వారా తమ పిల్లలకు డబ్బు పంపగలరు.

మరింత సమాచారం తెలుసుకోండి: