జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ఆంధ్రాలో ప్రధాన ఆశాకిరణం కాపు సామాజిక వర్గమే.. అందులో ఎలాంటి అనుమానం లేదు. మరి ఆ కాపు కులస్తులంతా పవన్ వైపు నిలబడతారా.. పవన్ కు అండగా నిలుస్తారా.. అన్న సంగతి మాత్రం సందేహాస్పదంగా ఉంది.
అధికారం సంగతి ఎలా ఉన్నా.. పవన్ కల్యాణ్పై సినీ రచయిత చిన్ని కృష్ణ మాత్రం ఓ రేంజ్లో పైర్ అయ్యారు. కాపులకు పవన్ కల్యాణ్ ఏదో చేస్తాడని ఊహించొద్దని షాక్ ఇచ్చాడు. అంతే కాదు.. తానూ కాపు కులస్తుడనేనంటూ షాక్ ఇచ్చారు.
పవన్, చిరంజీవి, నాగబాబు.. వీరు కాపులకు ఒరగబెట్టిందేమీ లేదని చిన్నికృష్ణ మండిపడ్డారు. రేపు ఎన్నికల తర్వాత కాబోయే సీఎం జగన్ అనే అంచనాకు వచ్చిన టీడీపీ, జనసేన,కాంగ్రెస్ పార్టీలు ఆయన్ని ఇబ్బందుల పాలు చేయాలని చూస్తున్నారన్నారు.
ప్రజారాజ్యం పేరిట పార్టీని పెట్టి, ఆపై దాన్ని కాంగ్రెస్లో కలిపారని, తనకు ఓట్లు వేసిన ప్రజలను ఆయన ఒక్కసారైన కలిశారా ? అని చిన్ని కృష్ణ ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైయస్ఆర్సీపీ విజయం సాధించడం ఖాయం అన్నారు. మరి కాపులు చిన్నికృష్ణ ప్రసంగం వింటే పునరాలోచనలో పడటం ఖాయం.