ఏపీ ఎన్నికల పోలింగ్ తర్వాత జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తొలిసారి బయటకు వస్తున్నారు. ఎన్నికల ప్రచారం ముగింపు దశలోనే కాస్త అనారోగ్యానికి గురైన పవన్ కల్యాణ్ ఎన్నికలు పూర్తయ్యాక కాస్త విరామం ఇచ్చారు. ఎన్నికల హడావిడి ముగియడంతో విశ్రాంతి తీసుకున్నారు. 


తాజాగా ఆయన నేడు నంద్యాలలో ఆయన పర్యటించనున్నారు. ఇటీవల కన్నుమూసిన నంద్యాల ఎంపీ, జనసేన నేత ఎస్పీవై రెడ్డికి నివాళులు అర్పిస్తారు పవన్ కల్యాణ్. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. 

ఎస్‌పీవై రెడ్డి మొన్న జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున నంద్యాల నుంచి పోటీచేశారు. ఎస్పీవై రెడ్డి పలు పార్టీలు మారినా ప్రజల్లో ఆయనకు మంచి ఇమేజ్ ఉంది. పారిశ్రామిక వేత్తగా ఉండగానే ఆయన ఎన్నో సేవాకార్యక్రమాలు చేసి జనం గుండెల్లో నిలిచిపోయారు. 

నంద్యాల టూర్ ద్వారా మళ్లీ యాక్టివ్ అవుతున్న పవన్ కల్యాణ్.. ఆ తర్వాత జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై దృష్టి సారించే అవకాశం ఉంది. పార్టీ క్యాడర్‌ను కాపాడుకోవడం.. నిరంతరం జనంలో ఉండే కార్యక్రమాలు రూపొందించుకోవడం ద్వారా పార్టీని బలోపేతం చేసే ఆలోచనలో ఉన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: