ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ క్లీన్స్వీప్ దిశగా దూసుకుపోతోంది. తొలి రౌండ్ ఫలితాలు ముగిసేసరికి జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ స్థానాల్లోనూ వైసీపీ స్పష్టమైన ఆధిక్యం సాధించింది. పాతపట్నంతో పాటు పాలకొండ, రాజాంతో పాటు ధర్మాన సోదరులు పోటీ చేసిన నరసన్నపేట, శ్రీకాకుళం నియోజకవర్గాల్లోనూ వైసీపీ ఆధిక్యంలో ఉంది. ఇక మంత్రులు పోటీ చేసిన టెక్కలి, ఎచ్చెర్లలో అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు ఇద్దరూ వెనుకంజలోనే ఉన్నారు.