ఏపీ ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కారణం టీడీపీ నాయకులతో పాటు ఎల్లో మీడియా కూడా ప్రధాన కారణం అని తెలుగు తమ్ముళ్లు ఇప్పటికి ఫీల్ అవుతుంటారు. ఒకపక్క జాతీయ మీడియా టీడీపీ ఓటమి పాలవుతుందని కోడై కూస్తే ఎల్లో మీడియా మాత్రం టీడీపీకి 150 సీట్లు పైమాటే అంటూ బాకా ఊది బాబుగోర్ని పూర్తిగా తప్పుదారి పట్టించాయిట. వాస్తవాల్ని ఎప్పటికప్పుడు కప్పిఉంచుతూ అంతా ఓకే అన్న ధోరణికి బాబుగోర్ని తీసుకువచ్చారట. తప్పుడు కథనాలతో ప్రజలను కూడా మోసం చేసి.. తద్వారా భారీగా ఓట్లు పొందొచ్చు అని ఎల్లో మీడియా ప్లాన్. కానీ ఆ ప్లాన్ కాస్త రివర్స్ అయింది.
దాంతో టీడీపీ పరిస్థితి మరింతగా దిగజారింది. మొత్తానికి బాబు అధికారం కోల్పోయారు. అయినా ఎల్లో మీడియా మాత్రం టీడీపీకి వత్తాసు పలుకడం మాత్రం ఆపలేదు. బాబు పై సదరు మీడియా వర్గాల్లో మార్పులేవీ కనిపించడం లేదు. మెయిన్ మీడియా సంస్థలన్నీ కమ్మ సామాజిక వర్గానికే చెందినవి కావడమే దీనికి ప్రధాన కారణమట. దాని వల్లే బాబుగోరు ఆడిందే ఆట పాడిందే పాట మాదిరిగా ఎల్లో మీడియా కుడా ఆడిపాడిందట.
ఈ ఎల్లో మీడియాను ప్రజలు ఛీకొట్టేలా చేయాలని వైసీపీ ప్రణాళికలు వేస్తోందట. జర్నలిజం విలువల్ని దిగజార్చే వారిని నిలువరించే దిశగా జగన్ ప్రభుత్వం త్వరలో చర్యలు కూడా తీసుకోబోతుందట. గతంలో కేసీఆర్ ఎలాగైతే.. తనకు పడని మీడియాని ఎలాగైతే బ్యాన్ చేశారో జగన్ కూడా ఇప్పుడు మీడియా విషయంలో ఆ ఆలోచనతోనే ఉన్నాడట.మరి ఇది వర్క్ అవుట్ అవుతుందా ? చూడాలి.