చేసిన పాపం ఊరికే పోదంటారు. కాకపోతే దాని ఫలితం అనుభవించేందుకు కాస్త సమయం పడుతుందేమో.. ఈ మాటలు అంటున్నది నేను కాదండీ బాబు.. పాపం.. ఎన్నో రాజకీయాలు కళ్ల ముందు చూసిన ఓ మాజీ నాయకురాలు. తెలుగు నేలను తీవ్రంగా ప్రభావితం చేసిన ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి.. ఆమె చెబుతుందేమిటంటే.. ఏపీలో ముగ్గురు నాయుళ్లు తప్పకుండా జైలుకు వెళ్తారట.

 

ఇంతకీ ఈ ముగ్గురు నాయుళ్లు ఎవరనేదేగా మీ సందేహం.. కాస్త ఊహించండి.. మొదటి నాయుడు మీరు ఊహించిందే.. మిగిలిన రెండే ఆలోచిస్తున్నారా.. మీకా కష్టం ఎందుకు లెండి..

లక్ష్మీ పార్వతి చెబుతున్న ఈ ముగ్గురు నాయుడులు.. చంద్ర బాబు నాయుడు, అచ్చెన్నా యుడు, సుజనా నాయుడు అట. గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రాన్ని పడిపడి దోచుకున్నారని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి విమర్శించారు.

 

చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు, సుజనా నాయుడు జైలుకి వెళ్లడం ఖాయమని, వారు జైలుకు వెళ్తే చూడాలని ఉందని లక్ష్మీ పార్వతి తన మనసులో కోరిక బయట పెట్టారు. న్నారు. సోమవారం లక్ష్మీ పార్వతి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. విశాఖ భూములపై గత ప్రభుత్వం సిట్‌ వేసి చిన్న ఉద్యోగులను బలిచేశారని లక్ష్మీ పార్వతి అన్నారు.

 

సీఎం వైయస్‌ జగన్‌ ఏర్పాటు చేసిన సిట్‌ ద్వారా వాస్తవాలు వెల్లడవుతాయని లక్ష్మీ పార్వతి అన్నారు. సిట్‌ అధికారులు, కేంద్ర బృందాలు సమన్వయంతో పకడ్బందీగా పనిచేస్తారని లక్ష్మీ పార్వతి తెలిపారు. మళ్లీ తాను అధికారంలోకి వస్తే చంద్రబాబుని అండమాన్‌ జైలు పంపించాలని ఉందని ఎన్టీఆర్‌ అంటుండే వారు. ఆ రోజులు త్వరలోనే వస్తాయని ఆశిస్తున్నా’ అంటూ లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. మరి ఇంతకీ ఆమె కోరిక తీరుతుందా..?

మరింత సమాచారం తెలుసుకోండి: