రోజుకి దేశంలో దారుణాలు ఎక్కువైపోతున్నాయి. అందులోనూ వావివరుసలు మరచి అక్రమ సంబంధాల కేసులు మరి ఎక్కువైపోతున్నాయి. ఒక వివాహిత యువకుడితో శారీరక సంబంధం పెట్టుకుని బరితెగించింది. భర్త లేని సమయంలో ప్రియుడితో రాసలీలలు కొనసాగించేది. ఇక అది తన జీవితంలో శాశ్వతం కావాలని భావించిన ఆమె తన ప్రియుడితో కలిసి భర్తని దారుణంగా హత్య చేయించింది. అంతే కాకుండా అతను చనిపోయాడు అని హైడ్రామాకు తెర లేపింది. దీంతో అనుమానం వచ్చిన అత్తమామలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా అసలు విషయం బయటపడింది.

 


ఇక అసలు విషయానికి వస్తే... ఈ సంఘటన పుదుచ్చేరి లో జరిగింది. కందస్వామి, భువనేశ్వరి వీరిద్దరూ భార్యాభర్తలు. వీరిరువురికీ ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. అయితే భర్త స్థానికంగా ఉన్న ఒక ఎయిడెడ్ స్కూల్లో బస్సు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇక అదే ప్రాంతానికి చెందిన అజిత్ కుమార్ అని యువకుడితో భువనేశ్వరికి పరిచయం ఏర్పడి అది కాస్తా సాన్నిహిత్యం పెరగడంతో వారిద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడి అక్రమ సంబంధానికి దారితీసింది.

 


ఇది ఇలా ఉండగా భర్త డ్యూటీకి వెళ్ళిన తర్వాత ప్రియుడితో భువనేశ్వరి రాసలీలలు కొనసాగించేది. అయితే ఈ విషయం తీరా తన భర్తకి తెలుసుకోవడంతో తన పద్ధతి మార్చుకోవాలని భార్యను హెచ్చరించాడు. ఈ విషయం నచ్చని భువనేశ్వరి ప్రియుడితో కలిసి తన భర్తని అడ్డు తొలగించుకునేందుకు ఒక పక్కా ప్లాన్ వేసింది. ఆ ప్లాన్ ఏంటంటే తన ప్రియుడు ఆయన స్నేహితుడు ఇద్దరు కలిసి ఒక కారు అద్దెకు తీసుకున్నారు. కందస్వామి స్కూల్లో డ్యూటీ ముగించుకుని బైక్ పై ఇంటికి వస్తున్న సమయంలో ఆయనను కార్ తో గుద్ది చంపేశారు. ఇక ఆ తర్వాత యాక్సిడెంట్ లో తన భర్త చనిపోయాడు అంటూ స్థానికులను నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే ఈ విషయంలో అతడి తల్లిదండ్రులకు అనుమానం రావడంతో వారు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఈ విషయంపై ఫిర్యాదు చేశారు.

 


ఇక ఈ విషయంలో పోలీసులు తనదైన శైలిలో విచారించగా అజిత్ భువనేశ్వరి సంబంధం బయటకి వచ్చింది. ఇక ఆ కోణంలో వారిని విచారించగా అసలు నిజం బయటికి వచ్చింది. దీనితో ఇక వారిద్దరినీ, అజయ్ స్నేహితుడుని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు పంపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: