ఈ మధ్యకాలం లో క్షణికావేశం లో తీసుకున్న నిర్ణయాలు ఎంతోమంది ప్రాణాలbను బలి తీసుకుంటున్న విషయం తెలిసిందే. అసలు మనుషుల ప్రాణాల కు విలువ లేకుండా పోతుంది. చిన్న చిన్న కారణాల కే మనస్థాపం చెంది కఠిన నిర్ణయాలు తీసుకుని ఏకంగా జీవితాన్ని అర్ధాంతరం గా ముగిస్తున్నారు ఎంతోమంది. టీచర్ తిట్టిందనో  లేదా తల్లిదండ్రులు మందలించారనో  అనే చిన్న చిన్న కారణాల తో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే... స్నేహితుడు తో గొడవ జరిగిందని లేదా భార్య తిట్టిందనే  కారణం తో మరి కొంతమంది మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు కూడా ఎన్నో తెరమీదికి వస్తూనే ఉన్నాయి.



 ఇలా క్షణికావేశం లో తీసుకున్న నిర్ణయాలు ఎన్నో కుటుంబాల్లో  తీరని విషాదాన్ని నింపుతున్నాయి. ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులు లేని పిల్లలు గా అనాథలు గా మారుతున్నారు. ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన చోటు చేసుకుంది. చిన్న కారణాని కి మనస్థాపం చెందిన ఓ వ్యక్తి ఏకంగా కఠిన నిర్ణయం తీసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ద్విచక్ర వాహనంపై ఆ యువకుడికి ఉన్న ప్రేమ ఏకంగా ప్రాణం తీసేంత వరకూ వెళ్ళింది. ఇటీవలే బైక్   కొనడం వద్దన్నందుకు  వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.



దీంతో కుటుంబంలో తీరని విషాదం నిండిపోయింది.. బైక్ కొనివ్వలేదని మనస్తాపం చెందిన వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలో చోటుచేసుకుంది. జగదేవ్ పూర్ లోని లింగారెడ్డి పల్లి గ్రామానికి చెందిన నర్సింలు గౌడ్ వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవలే ద్విచక్ర వాహనం  కొనుగోలు చేయాలనుకున్న  నరసింహ గౌడ్ ఈ విషయాన్ని ఇంట్లో చెప్పగా ఇంట్లో కుటుంబ సభ్యులు మాత్రం నిరాకరించారు  దీంతో మనస్థాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు నర్సింలు గౌడ్.

మరింత సమాచారం తెలుసుకోండి: