ఇక ప్రధానమంత్రి పెన్షన్ యోజన పథకం ద్వారా ఎంతోమంది 70 వేల రూపాయలు పొందేందుకు అర్హత సాధించారు అంటూ అందరికీ మెసేజ్ కూడా వచ్చింది.దీంతో అందరూ ఎంతగానో సంబరపడిపోయారు ఇక ఆ తర్వాత ఈ మెసేజ్ కాస్త వైరల్ గా మారి పోవడం తో అప్పుడు కాస్త అసలు విషయం బయటపడింది. ప్రధానమంత్రి పెన్షన్ యోజన పేరిట ఫోన్ లోకి వస్తున్న ఓ మెసేజ్ ఫేక్ అంటూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పష్టంచేసింది. దీంతో ప్రధాన మంత్రి పెన్షన్ యోజన పేరిట 70 వేల రూపాయలు వస్తాయని సంబర పడిపోయిన వారికి ఫేక్ మెసేజ్ అని తేలడంతో నిరాశ చెందారు.
అయితే ప్రధానమంత్రి పెన్షన్ యోజన అనే పథకాన్ని అసలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్ట లేదు అంటూ స్పష్టం చేసింది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. కాగా ఈ మధ్య కాలంలో ఇలా సోషల్ మీడియాలో ఎన్నో రకాల ఫేక్ వార్తలు వైరల్ గా మారిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలందరికీ మేలు జరిగే విధంగా వివిధ రూపాలలో డబ్బులు అందజేస్తుంది అనే సారాంశం కలిగిన ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయి జనాలను అందరిని కూడా అయోమయంలో పడేస్తున్నాయి అన్న విషయం తెలిసిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి