గత నెల 26వ తేదీన వికారాబాద్ లోని ఓ ప్రాంతంలో అమృతమ్మ అనే మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా.. పోలీసులు దర్యాప్తులో భాగంగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహిళ హత్య కేసు ఛేదిస్తున్న సమయంలో వెలుగులోకి వచ్చిన విషయాలతో అటు పోలీసులు సైతం షాకయ్యారు. అల్లిపురం కిష్టప్ప 60 ఏళ్ల వృద్ధుడు ఏకంగా 6 హత్య చేసినట్లుగా విచారణలో తెలుగు. 1985 నుంచి 2021 వరకు ఏకంగా ఆరుగురిని హత్య చేసినట్లు విచారణలో గుర్తించారు.
1985 లోనే కిష్టప్ప అనే వ్యక్తి పై పోలీసులు రౌడీషీట్ తెరిచారు. అంతేకాదు వికారాబాద్ జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో కూడా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు కిష్టప్ప. అయితే ఇటీవలే అతనిపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయట పెట్టాడు. గత నెల 26వ తేదీన జరిగిన మహిళ హత్య కూడా కిష్టప్ప చేసినట్లుగా పోలీసులు విచారణలో తేలడంతో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటనతో స్థానిక ప్రజలు అందరూ కూడా భయాందోళనకు గురయ్యారు.