ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో రష్మిక మందన్న పూజాహెగ్డే స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే.  రష్మిక మందన్న కంటే పూజా హెగ్డే కాస్త ఇండస్ట్రీలో సీనియర్ అయినప్పటికీ రష్మిక మందన్న మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ.. బ్లాక్ బస్టర్ విజయాలని  తన ఖాతాలో వేసుకుని  తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ ని సంపాదించింది అని  చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడు ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు కూడా స్టార్ హీరోల సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు.  ఏ స్టార్ హీరో సినిమాలో చూసిన ఇద్దరిలో ఎవరో ఒక హీరోయిన్ కనిపిస్తున్నారు.



 కేవలం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే కాదు కన్నడ తమిళ ఇండస్ట్రీలో కూడా తమ హవా నడిపిస్తున్నారు ఇద్దరు హీరోయిన్లు. ఈ క్రమంలోనే అక్కడ కూడా స్టార్ హీరోలు ఇద్దరు హీరోయిన్లలో ఒకరిని  తమ సినిమాల్లో తీసుకోవడానికి పోటీపడుతున్నారు. అయితే పూజా హెగ్డే.. లేదంటే రష్మిక మందన్న అని అనుకుంటున్నారు కానీ ఇతర హీరోయిన్ల వైపు మాత్రం అస్సలు మొగ్గు  చూడటం లేదు దర్శకనిర్మాతలు. ఇక ఇద్దరు హీరోయిన్లు కూడా ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో బిజీ బిజీగా గడుపుతున్నారు అన్న విషయం తెలిసిందే.  ఇకపోతే ఇటీవలే రష్మిక మందన్న చేయాల్సిన సినిమాను పూజా హెగ్డే దక్కించుకున్నట్లు తెలుస్తోంది.



 నెల్సన్  దిలీప్  కుమార్  దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో చిత్రబృందం మొదట రష్మిక మందన ను ఎంపిక చేసింది. కానీ ప్రస్తుతం రష్మిక మందన వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో..  ఇక కాల్షీట్స్ కాళీ లేవు అని చెప్పేసిందట. దీంతో ఇక మరో స్టార్ హీరోయిన్ అయిన పూజ హెగ్డే ను  సినిమా కోసం చిత్రబృందం సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కథ నచ్చడంతో అటు పూజా హెగ్డే కూడా వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. ఇలా రష్మిక చేయాల్సిన సినిమాను పూజాహెగ్డే చేస్తుంది అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: