వాళ్ళిద్దరూ ఉన్నత చదువులు చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించారు. ఇక ఉద్యోగం చేస్తున్న సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది ఇక కొన్ని రోజుల్లోనే వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి పోయింది.  ఎన్నో రోజుల పాటు ప్రేమించుకున్న వీరిద్దరూ ప్రేమకు కులాలు మతాలు వేరు కావు అని నిరూపించారు. వారిద్దరి కులాలు మతాలు వేరైనా ఇక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు పెద్దలకు వారి ప్రేమ విషయం చెప్తే అంగీకరించ లేదు అయినప్పటికీ ఒకరిని విడిచి ఒకరు ఉండలేక పెద్దలను ఎదిరించి మరీ ప్రేమ పెళ్లి చేసుకున్నారు


 వీరి ప్రేమకు గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. కానీ అంతలో ఏం జరిగిందో తెలియదు గానీ భార్య అనుమానాస్పదంగా మృతి చెందడం సంచలనంగా మారిపోయింది. అయితే మీ కూతురు గుండెపోటుతో మరణించిందని ఆస్పత్రికి తీసుకెళితే అప్పటికే మరణించినట్లు డాక్టర్లు చెప్పారు అంటూ యువతి తల్లి కి ఫోన్ చేసి చెప్పాడు భర్త. కానీ తన కూతురు మృతిపై తల్లి మాత్రం అనుమానాలు వ్యక్తం చేసింది. గంటల ముందు వరకు తనతో ఎంతో సంతోషంగా మాట్లాడిన కూతురు అంతలోనే ఎలా మృతి చెందుతుంది అంటూ అనుమానం వ్యక్తం చేసింది. అంతటితో ఆగకుండా నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఈ ఘటనపై ఫిర్యాదు చేసింది.



 ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ఇమ్రాన్ లతా మాధురి సాఫ్ట్ వేర్ ఉద్యోగులు గా పనిచేస్తూ ఉండగా వీరి మధ్య పరిచయం ఏర్పడి ఇక ప్రేమగా మారి తర్వాత ఇద్దరూ కూడా కులాలు మతాలు వేరైనప్పటికీ పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ఇక తొమ్మిదేళ్ల నుంచి వీరి కాపురం ఎంతో సాఫీగా సాగిపోతుంది. కానీ ఇటీవల ఏం జరిగిందో తెలియదు కానీ రాత్రి సమయంలో మీ అమ్మాయి లతా మాధురి గుండెపోటుతో మరణించిందంటూ అల్లుడు యువతి తల్లి కి ఫోన్ చేసి చెప్పాడు కానీ కూతురి మరణంపై తల్లి ఎన్నో అనుమానాలు వ్యక్తంచేసింది కొన్ని గంటల ముందు తనతో మాట్లాడిన కూతురు ఎలా చనిపోతుంది అంటూ ప్రశ్నించింది ఇక వెంటనే పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేసింది. అల్లుడు తన కూతురు ని చంపేసాడు అంటూ కేసు పెట్టింది అయితే అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇక సదరు యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: