ఎంపీ రఘురామ విషయం నిన్న మొన్నటి వరకూ ఢిల్లీలోనూ హాట్ టాపిక్ అయ్యింది. ఓ ఎంపీని అలా కొట్టేస్తారా అన్న చర్చ జరిగింది. దీనికి తోడు రఘురామ తన కాళ్ల దెబ్బల ఫోటోలను ఎంపీలందరికీ పంపారు. అవి చూసి చాలా మంది ఇది చాలా దారుణం అంటూ స్పందించారు. నేషనల్ మీడియా కూడా కొన్ని రోజులుగా హడావిడి చేసింది. అయితే జగన్ ఢిల్లీ టూర్ తర్వాత ఆ హడావిడి తగ్గింది.

అందుకు జగన్ టీమ్ ఢిల్లీ పెద్దల ముందు ప్రదర్శించిన 13నిమిషాల వీడియోనే కారణమని చెబుతున్నారు. ఒక పదమూడు నిమిషాల వీడియోను జగన్ మోహన్ రెడ్డి, ఆయన తరపున మనుషులు వివిధ మీడియా సంస్థలకూ, అమిత్ షా వంటి పెద్దలకు చేరవేశారట. అందులో రఘురామ కృష్ణంరాజుకు సంబంధించిన చాలా వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయట. ఆయన కోర్టుకు వచ్చినప్పుడు మాములుగా నడుచుకుంటూ రావడం.. ఆ తర్వాత హైదరాబాదు తీసుకెళ్లేటప్పుడు కాళ్లు చూపెడుతూ ఉండటం అన్నీ ఉన్నాయట.

ఆ తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మామూలుగా నడుచుకుంటూ వెళ్లడం..  స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లేటప్పుడు ఎయిర్ పోర్టు దగ్గర మామూలుగా దిగడం.. ఆయనకి కొందరు శాలువ కప్పినప్పుడు మామూలుగా నడవటం.. ఇలా రఘురామకు సంబంధించిన అనేక వీడియో ఫుటేజ్‌లు సేకరించి ట్రిమ్ చేసి 13 నిమిషాల వీడియోను రూపొందించారట. ఇదీ రఘురామ డ్రామా అంటూ చెప్పకనే చెప్పారన్నమాట.

అంతే కాదు.. రఘురామ ఆ తర్వాత ఢిల్లీ వచ్చిన ఎయిమ్స్ లో చేరాడు కదా.. ఆ ఎయిమ్స్ వైద్యుల రిపోర్టులను కూడా తెప్పించుకుని చెక్ చేసుకోండి అంటూ సలహా ఇచ్చారట. ఇప్పుడు ఢిల్లీ సర్కిళ్లో ఈ   పదమూడు నిమిషాల వీడియో మాట బాగా వినబడుతోంది. మరి ఇందులో ఎంత మేర వాస్తవం ఉందన్నది తెలీదు కానీ.. ప్రచారం మాత్రం జోరుగాఎంపీ రఘురామ విషయం నిన్న మొన్నటి వరకూ ఢిల్లీలోనూ హాట్ టాపిక్ అయ్యింది. ఓ ఎంపీని అలా కొట్టేస్తారా అన్న చర్చ జరిగింది. దీనికి తోడు రఘురామ తన కాళ్ల దెబ్బల ఫోటోలను ఎంపీలందరికీ పంపారు. అవి చూసి చాలా మంది ఇది చాలా దారుణం అంటూ స్పందించారు. నేషనల్ మీడియా కూడా కొన్ని రోజులుగా హడావిడి చేసింది. అయితే జగన్ ఢిల్లీ టూర్ తర్వాత ఆ హడావిడి తగ్గింది.

అందుకు జగన్ టీమ్ ఢిల్లీ పెద్దల ముందు ప్రదర్శించిన 13నిమిషాల వీడియోనే కారణమని చెబుతున్నారు. ఒక పదమూడు నిమిషాల వీడియోను జగన్ మోహన్ రెడ్డి, ఆయన తరపున మనుషులు వివిధ మీడియా సంస్థలకూ, అమిత్ షా వంటి పెద్దలకు చేరవేశారట. అందులో రఘురామ కృష్ణంరాజుకు సంబంధించిన చాలా వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయట. ఆయన కోర్టుకు వచ్చినప్పుడు మాములుగా నడుచుకుంటూ రావడం.. ఆ తర్వాత హైదరాబాదు తీసుకెళ్లేటప్పుడు కాళ్లు చూపెడుతూ ఉండటం అన్నీ ఉన్నాయట.

ఆ తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మామూలుగా నడుచుకుంటూ వెళ్లడం..  స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లేటప్పుడు ఎయిర్ పోర్టు దగ్గర మామూలుగా దిగడం.. ఆయనకి కొందరు శాలువ కప్పినప్పుడు మామూలుగా నడవటం.. ఇలా రఘురామకు సంబంధించిన అనేక వీడియో ఫుటేజ్‌లు సేకరించి ట్రిమ్ చేసి 13 నిమిషాల వీడియోను రూపొందించారట. ఇదీ రఘురామ డ్రామా అంటూ చెప్పకనే చెప్పారన్నమాట.

అంతే కాదు.. రఘురామ ఆ తర్వాత ఢిల్లీ వచ్చిన ఎయిమ్స్ లో చేరాడు కదా.. ఆ ఎయిమ్స్ వైద్యుల రిపోర్టులను కూడా తెప్పించుకుని చెక్ చేసుకోండి అంటూ సలహా ఇచ్చారట. ఇప్పుడు ఢిల్లీ సర్కిళ్లో ఈ   పదమూడు నిమిషాల వీడియో మాట బాగా వినబడుతోంది. మరి ఇందులో ఎంత మేర వాస్తవం ఉందన్నది తెలీదు కానీ.. ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.  సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: