టిడిపి తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ ఇక అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరడం దాదాపు ఖరారైపోయింది. గత కొన్ని రోజుల నుంచి ఎల్ రమణ   టిఆర్ఎస్ లో చేరబోతున్నారు అన్న ప్రచారం ఊపందుకుంది. ఇటీవలే ఎల్.రమణ ఏకంగా ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో సమావేశం కావడం తో అందరికీ క్లారిటీ వచ్చేసింది.  ఇక సీఎం కేసీఆర్ తో సమావేశం తర్వాత కెసిఆర్ తనను టిఆర్ఎస్ లోకి రావాలని కోరారు అని దీనిపై తాను కూడా సానుకూలంగానే ఉన్నాను అని ప్రకటించారు ఎల్.రమణ.  అయితే ఇన్ని రోజుల వరకు టిడిపి పార్టీలో కొనసాగి.. ఇక ఇప్పుడు అధికార పార్టీలోకి ఎల్.రమణ వెళుతూ ఉండడంపై అటు ప్రతిపక్ష పార్టీలు మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.



 పదవి కోసమే ఎల్.రమణ టిఆర్ఎస్ పార్టీ లోకి వెళ్తున్నారు అంటూ విమర్శలు చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు. అయితే తాజాగా దీనిపై స్పందించిన రమణ  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీపై టిఆర్ఎస్ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉన్నాను అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ తో జరిగిన సమావేశంలో హుజురాబాద్ ఉప ఎన్నిక గురించి చర్చ జరగలేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవి కోసమే టీఆర్ఎస్ లో చేరబోతున్నాను అంటూ కొన్ని పార్టీలు తనపై తప్పుడు ప్రచారాలు చేయడం హాస్యాస్పదం అన్నారు ఎల్.రమణ.



 పదవులు తనకు కొత్త కాదు అంటూ చెప్పుకొచ్చాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంపీగా ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా పని చేశా అంటూ రమణ తెలిపారు. ఏ పార్టీలోనైనా కష్టపడి పని చేస్తే పదవులు వాటంతట అవే వస్తాయి అంటూ ఎల్.రమణ వ్యాఖ్యానించారు. కొన్ని సంవత్సరాల క్రితమే కెసిఆర్ టిఆర్ఎస్ లోకి రావాలని తనను ఆహ్వానించారని..  అయితే ప్రజలకు మరింత సేవ చేయడం కోసమే ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో కి వెళ్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు. కెసిఆర్ నాయకత్వంలో బలహీనవర్గాలకు సంక్షేమ పథకాలు అందజేయడమే తమ లక్ష్యం అన్నారు. ఇక మరో రెండు మూడు రోజుల్లో టిఆర్ఎస్ పార్టీ లోకి వెళ్ళ పోతున్నాను అంటూ ఎల్.రమణ ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: