మామూలుగా ఇతర దేశాల తో పోల్చి చూస్తే అటు ఇండియా లో దైవభక్తి ఎక్కువగానే ఉంటుంది. జనాలు ఎంతో మంది దేవుళ్లను ఎక్కువగా కొలుస్తూ వుంటారు. కానీ అందరూ కామన్గా కొలిచే దేవత మాత్రం లక్ష్మీదేవి అని చెప్పాలి. ప్రతి ఒక్కరూ సిరి సంపదలు కలిగిన లక్ష్మీ దేవికి పూజలు చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు.  ఇంట్లో లక్ష్మీ దేవి ఫోటోలు పెట్టుకొని తరచూ పూజలు చేయడం లాంటివి చేస్తూ ఉంటారూ.  లక్ష్మీ దేవి కటాక్షం కోసం ఎన్నో వ్రతాలు నోములు సైతం చేస్తూ ఉంటారు.


 అయితే భారత్లో అందరూ పూజించే లక్ష్మీ దేవిని విదేశాల్లో ఎవరైనా పూజిస్తారా అంటే..  విదేశాల్లో లక్ష్మీ దేవిని ఎందుకు పూజిస్తారు అని ఎదురు ప్రశ్నిస్తారు ఎవరైనా. కానీ ఇటీవలే బ్రిటన్లో లక్ష్మీ దేవి ప్రత్యక్ష మైంది.  సాధారణం గా తెలుగు సాంప్రదాయ పండుగైన దీపావళి ఎంతో అంగరంగ వైభవం గా జరుపు కుంటారు భారత్లో. కానీ ఈ పండుగను ఘనం గా జరుపుకోకుండా ఎన్నో రకాల  రూల్స్ కూడా తెర మీదికి తెస్తున్నాయి  ప్రభుత్వాలు.



 ఇటీవల బ్రిటన్లో మాత్రం ఏకంగా దీపావళి సందర్భం గా బంగారానికి సంబంధించి ఒక కీలక మైనటువంటి నిర్ణయం తీసు కున్నారు. దీపావళి సంబరాల లో భాగంగా బ్రిటన్ కు చెందిన టువంటి రాయల్ మింట్ అనే కంపెనీ తొలి సారిగా లక్ష్మీ దేవి చిత్రం తో కూడినటు వంటి ఒక నాణాన్ని తయారు చేసింది.  20 గ్రాముల బంగారం తో రూపొందించిన ఇక నాణెం ధర ఒక లక్ష 8 వేల వరకు ఉంటుందట.  ఇక ఈ నాణెం ఫై లక్ష్మీ దేవిని ఎంతో అద్భుతం గా రూపు దిద్దారు. ఇలా ఇటీవలే భారతీయులందరూ ఎంతో నిష్ట గా కొలిచే లక్ష్మీ దేవి అటు బ్రిటన్లో ప్రత్యక్షం అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: