గత ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన ఆయన విశాఖ ఎంపీ టికెట్ దక్కించుకుని బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్ ఓడించి సంచలనం క్రియేట్ చేశారు. ఎంపీగా గెలిచిన అప్పటినుంచి సత్యనారాయణకు వైసీపీలో పెద్దగా ప్రాధాన్యత లేదు. విశాఖ పార్టీ వ్యవహారాలు అన్నీ ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కనుసన్నల్లో నడుస్తూ వస్తున్నాయి. దీంతో అక్కడ ఎంపీకు మాత్రమే కాదు మంత్రి అవంతి తో పాటు మిగిలిన ఎమ్మెల్యేలను కూడా ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు.
ఇక ఎంవీవీ ఎప్పుడూ ప్రెస్ మీట్లు జరిగినా విజయసాయి పక్కన డమ్మీగా ఉంటూ ఉండేవారు. అయితే ఇప్పుడు ఆయన సొంతంగా క్రేజ్ పెంచుకుంటున్నారు. విజయసాయి రెడ్డితో సఖ్య తతో ఉంటూనే స్థానికంగా ప్రజలకు అందు బాటులో ఉంటూ.. తన వద్దకు వచ్చే వారి సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తున్నారు. ఇలా చేయడం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి తాను మళ్ళీ రంగంలో ఉండాలని ఎంవీవీ సత్యనారాయణ మాస్టర్ ప్లాన్ తో రెడీ అవుతున్నారన్న చర్చలు స్థానిక వైసీపీ నేతల్లో వినిపిస్తున్నాయి. ఇక ఈ సీటు విషయంలో వైసీపీ నుంచి ఎంవీవీకి పెద్దగా పోటీ కూడా ఎవ్వరూ లేరనే చెప్పాలి.