ఇక ఉగ్రవాదులను కనిపెట్టేందుకు వివిధ ఆపరేషన్స్ నిర్వహిస్తూ ఎక్కడ దాక్కొని ఉన్నా కూడా పట్టుకుని ఎన్కౌంటర్ చేస్తుంది భారత ఆర్మీ. దీంతో గత కొన్ని రోజుల నుంచి ఏకంగా 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. అయినప్పటికీ అటు ఉగ్రవాదుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత సైనికులు ఓ వైపు వరుసగా ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేస్తున్నప్పటికీ అటు ఉగ్రవాదులు మాత్రం భారత సైన్యానికి సవాల్ విసురుతూనే ఉన్నారు. ఇండియన్ ఆర్మీ మమ్మల్ని ఏమీ చేయలేదు అంటూ వాట్సాప్ గ్రూపులో స్టేట్మెంట్లు ఇస్తూ వీడియోలను వైరల్ గా మారుస్తున్నారు. ఇటీవలే ఒక ఉగ్రవాది ఇలా భారత ఆర్మీ కి ఛాలెంజ్ విసిరి చివరికి ప్రాణాలు వదిలాడు.
భారత ఆర్మీ రంగంలోకి దిగి ఇలా ఛాలెంజ్ విసిరిన ఉగ్రవాదిని ఎన్కౌంటర్ చేసి చంపేసింది. మెహెరాన్ యాసీన్ అనే వ్యక్తి ఇటీవలే ఒక వీడియో ద్వారా ప్రకటన చేశాడు. ఉగ్రవాద సంస్థకు సంబంధించిన టాప్ కమాండర్ అయిన సదరు వ్యక్తి ఇండియన్ ఆర్మీ కి సవాల్ విసరడంతో రంగంలోకి దిగిన ఇండియన్ ఆర్మీ అతని ని ట్రాక్ చేయడం మొదలు పెట్టింది. చివరికి ఇటీవలే ఆచూకీ లభించడంతో ఒక్కసారిగా దాడి చేసిన ఇండియన్ ఆర్మీ అతని ఎన్కౌంటర్లో చంపేసింది. ఈ ఘటన భారత ఆర్మీ ఎంత దూకుడుగా ముందుకు సాగుతుంది అన్న దానికి నిదర్శనంగా మారింది అని చెప్పాలి