ఒకే రాష్ట్రంలో ఉన్న రెండు రాజకీయ పార్టీల మధ్య విభేదాలు ఉండడం అనేది సర్వసాధారణమైన విషయం. అలాగే ఆ పార్టీ అధినేతలు కూడా ఎప్పుడు ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకోవడం అనేది కూడా సర్వసాధారణంగా జరిగే విషయమే. కానీ వయస్సు పెరిగే కొద్దీ కోపతాపాలు మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తుంటాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఎందుకు పూర్తి భిన్నంగా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు వయస్సు ఇప్పటికే చాలా పెరిగిపోయింది.

కానీ ఆయన కోపం మాత్రం వైసీపీ పార్టీ అధినేత జగన్ పై ఏమాత్రం తగ్గడం లేదు. ఇక చంద్రబాబు నాయుడు... వైసీపీ పార్టీ అధినేత జగన్ మరియు అతని పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. అందులో చంద్రబాబు నాయుడు ... జగన్ కు మిజరబుల్ ట్రీట్ మెంట్ వుంటుంది అని... చరిత్రలో ఏ రాజకీయ నాయకుడి కి జరగనటువంటి ట్రీట్ మెంట్ ఇతనికి వుంటుంది అన్నారు.

అలాగే చరిత్రలో అతిగా ప్రవర్తించేవారికి ఇలాంటి ఎండింగ్ వుంటుంది అని , దానికి అతను కూడా సిద్దం కావాలని , అతనే కాదు , అతని పార్టీ వాళ్లు కూడా ఇలాంటి ట్రీట్ మెంట్ కు రెడీ కావాలని చంద్రబాబు అన్నారు.  ఇక ఈ వీడియోని బట్టి చూస్తే చంద్రబాబు కి వైసీపీ పార్టీ అధినేత జగన్ పై అలాగే తన పార్టీ నాయకులు , కార్యకర్తలపై ఎంత కోపం ఉందో అర్థం అవుతుంది.

ఇది ఇలా ఉంటే మరికొన్ని రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల కోసం ప్రస్తుతం అధికారంలో ఉన్న వై సీ పీ ఒంటరిగా పోటీలోకి దిగగా... టీ డీ పీ , జనసేన బీ జే పీ మూడు పార్టీలు కలిపి పొత్తులో భాగంగా పోటీ చేస్తున్నాయి. మరి ఈ ఇరు కుటములలో ఏ కూటమి ప్రజల మనసులను ఎక్కువగా గెలుచుకొని పవర్ లోకి వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: